బాబోయ్ ఇప్పటికే చలి చంపేస్తుంది.. మరీ రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉండనున్నాయో తెలుసా?

0
205

తెలంగాణలో రోజురోజుకూ చలి తీవ్రత పెరిగిపోతుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో నమోదవుతుంగా.. రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ తీవ్ర మరింత పెరగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి రానున్న మూడు రోజుల్లో, గడిచిన కొన్ని రోజుల్లో రాష్టరంలో ఉష్ణోగ్రతలు ఎలా ఉన్నాయో చూద్దాం.

 

చలికాలం ప్రారంభమై కొన్ని రోజులుకూడా కాలేదు. అప్పుడే తెలంగాణలో చలి తీవ్ర పెరిగిపోయింది. రోజురోజుకూ తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో జనాలు ఉదయం సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే చాలా ప్రాతాంల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదై సింగిల్‌ డిజిట్‌కు పడిపోగా.. రానున్న రెండు మూడు రోజుల్లో ఇది మరింత తగ్గనుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

 

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్జ్ జారీ

పెరుగుతున్న చలి తీవ్ర, దట్టమైన పొగమంచు నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది. ఆయా జిల్లాలో రానున్న మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని.. ఉత్తర తెలంగాణ పశ్చిమ, మధ్య తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హేచ్చరించింది.

 

ఈ  జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

ఇక నిన్నటితో పాటు ఇవాళ మార్నింగ్ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పటాన్ చెరువులొ 6.4 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 8.2, రాజేంద్ర నగర్‌లో10.5, మెదక్‌లో 8.8 హనుమకొండలో 11.5, రామగుండంలో 12.2, నల్లగొండలో 13, నిజామాబాద్‌లో 12.5, దుండిగల్‌లో 12.4, హయత్ నగర్‌లో 13.6, హైదరాబాద్‌లో 13.2, భద్రాచలంలో 16, ఖమ్మంలో 14.6 హకీమ్ పేటలో 15, మహబూబ్ నగర్ లో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి

చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చలి కాలంలో మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి బట్ట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటు వెళ్లినా స్వెట్టర్ లేదా జాకెట్‌ను పక్కా ధరించాలి, బైక్‌పై వెళ్లేప్పుడు చెవులు, తలను మొత్తం కవర్ చేసేలా హెల్మెట్‌, క్యాప్స్‌ ధరించాలి, చేతులకు గ్లౌజెస్ సైతం వేసుకోవాలి. కారులో ప్రయాణించే వారు విండ్‌షీల్డ్‌ను ఎప్పికప్పుడూ క్లీన్ చేసుకోవాలి, కారు వైజర్ పనిచేస్తుందో లేదో చూసుకోవాలి, కారులో ప్రయాణించేప్పుడు కాస్త నెమ్మదిగా వెళ్లాలి. ఎందుకంటే శీతాకాలంలో మంచు కురవడం వల్ల రోడ్డుపై తేమ ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

#Sivanagendra #Trending #News #Telangana #Coolweather 

Search
Categories
Read More
Andhra Pradesh
ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు
ఈరోజు సాయంత్రం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాయచోటిలో జరిగే ఇఫ్తార్ విందు...
By Benguluri Madhubabu 2026-03-15 10:34:26 0 146
Andhra Pradesh
చీరాల–చిలకలూరిపేట మార్గంలో టోల్ ప్లాజా ప్రారంభం – వాహనదారులకు సూచన
చీరాల నుంచి చిలకలూరిపేటకు వెళ్లే మార్గంలో పర్చూరు సమీపంలో ఉన్న టోల్ ప్లాజాను ఈరోజు...
By Vadlamudi NagaVenkat 2026-03-06 04:21:34 0 281
Andhra Pradesh
గుంటూరు సరస్ అఖిల భారత డ్వాక్రా బజార్ బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన శ్రీ ఎస్పి వాకుల్ జిందల్ ఐపీఎస్గారు కలెక్టర్ శ్రీ అన్సారీయా తమిమ్ గారు.
  <>కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు.   *గుంటూరు జిల్లా పోలీస్...* *తేదీ:...
By KOTESWARARAO KVSR 2026-01-06 14:44:58 0 316
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు ప్రముఖ పుణ్యక్షేత్రం బోయ కొండలో క్యూఆర్ కోడ్ స్కానర్లు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆలయ ఉప...
By Kothuru Murali 2026-02-11 08:42:59 0 86
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com