అల్వాల్ రెడ్డి సంఘం అభివృద్ధికి ఎమ్మెల్యే చేయూత.

0
170

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   అల్వాల్ సర్కిల్‌లోని తోట పెంటా రెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన రెడ్డి జన సంఘం సమ్మేళనంలో మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మచ్చ బొల్లారంలో రెడ్డి కుల సంఘ భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించారు. రెడ్డి సామాజిక వర్గం ఐక్యంగా ముందుకు సాగాలనే సంకల్పంతో సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ, భవిష్యత్‌ లో మరింత అభివృద్ధి దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ రెడ్డి భవనం పేద ప్రజలకు ఎల్లవేళల ఉపయోగపడే విధంగా ఉండాలని ఆకాంక్షించారు కుల సంఘ ఐక్యతను ప్రతిబింబించే ఈ సమ్మేళనం, భవిష్యత్‌లో సామాజిక శ్రేయస్సు కోసం మరిన్ని కార్యక్రమాలకు ప్రేరణగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జన సంఘ సభ్యులు గుమ్మడి ఆనంద్ రెడ్డి, కౌకుంట్ల శ్రీధర్ రెడ్డి,తోట దేస్వంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ,చింతల మాణిక్య రెడ్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్ లో డేంజర్ బెల్స్- గాలిలో పెరుగుతున్న విషం.|
హైదరాబాద్ :  హైదరాబాద్ వాసుల ప్రాణవాయువుకు పచ్చజెండా ఊగిపోతోంది. భాగ్యనగరంలో గాలి నాణ్యత...
By Sidhu Maroju 2026-01-30 06:52:46 0 81
Andhra Pradesh
రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు
*తే.18.12.2025 దీన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన...
By Rajini Kumari 2025-12-18 07:53:21 0 84
Andhra Pradesh
కర్నూలు బి క్యాంపు పోస్ట్ ఆఫీస్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు !!
కర్నూలు సిటీ : బి.క్యాంపు స్థానిక బి క్యాంపులో గల బి. క్యాంపు పోస్ట్ ఆఫీస్ నందు 77వ గణతంత్ర...
By Hari Krishna 2026-01-26 08:20:50 0 141
Andhra Pradesh
దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం... బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు
దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం...బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి....
By Gadiyapudi Narendra 2026-01-12 16:43:42 0 98
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com