అల్వాల్ రెడ్డి సంఘం అభివృద్ధికి ఎమ్మెల్యే చేయూత.

0
217

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   అల్వాల్ సర్కిల్‌లోని తోట పెంటా రెడ్డి గార్డెన్‌లో నిర్వహించిన రెడ్డి జన సంఘం సమ్మేళనంలో మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మచ్చ బొల్లారంలో రెడ్డి కుల సంఘ భవన నిర్మాణాన్ని ప్రారంభించాలని ప్రతిపాదించారు. రెడ్డి సామాజిక వర్గం ఐక్యంగా ముందుకు సాగాలనే సంకల్పంతో సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ, భవిష్యత్‌ లో మరింత అభివృద్ధి దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ రెడ్డి భవనం పేద ప్రజలకు ఎల్లవేళల ఉపయోగపడే విధంగా ఉండాలని ఆకాంక్షించారు కుల సంఘ ఐక్యతను ప్రతిబింబించే ఈ సమ్మేళనం, భవిష్యత్‌లో సామాజిక శ్రేయస్సు కోసం మరిన్ని కార్యక్రమాలకు ప్రేరణగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జన సంఘ సభ్యులు గుమ్మడి ఆనంద్ రెడ్డి, కౌకుంట్ల శ్రీధర్ రెడ్డి,తోట దేస్వంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి ,చింతల మాణిక్య రెడ్ తదితరులు పాల్గొన్నారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
పర్యాటకులకు ప్రత్యేక యాప్ ఆంధ్ర టాక్సీలో హాయి హాయిగా వివరిద్దాం
*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌* *ఎన్‌టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 25, 2025*...
By Rajini Kumari 2025-12-25 11:20:25 0 213
Andhra Pradesh
ప్రజా పిర్యాదుల పరిష్కార వేదిక !!
కర్నూలు : **  ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)...
By Hari Krishna 2025-12-22 11:21:04 0 163
Telangana
అధికారుల పనితిరు కి ప్రజలు బెఙరు
ఉప్ప గుడాలోని  shivasai nagar, మహంకాలీ దేవాలయం వద్ద మంచినిటి paipline ఏర్పాటుచేయడానికి ఉన్న...
By Poloju Bhaskar 2026-03-10 09:56:34 0 156
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com