రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు

0
192

*తే.18.12.2025 దీన రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుచున్న 5 వ జిల్లా కలెక్టర్ల సమావేశం రెండో రోజు కార్యక్రమంలో….*

 

*“స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” పై సమగ్ర చర్చలో భాగంగా నోడల్ సెక్రటరీ మరియు రాష్ట్ర ప్రణాళిక శాఖ ప్రిన్సిఫల్ సెక్రటరీ శ్రీ పియూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరిస్తూ….*

 

#“స్వర్ణ ఆంధ్ర @ 2047 – పది సూత్రాలు” లో భాగంగా పేదరహిత ఆంధ్ర (P4), నైపుణ్యాభివృద్ధి & ఉపాధి, జనాభా నిర్వహణ & మానవ వనరుల అభివృద్ది, నీటి భద్రత, వ్యవసాయ–టెక్నాలజీ, గ్లోబల్ బెస్టు లాజిస్టిక్స్, ఇంధన వ్యయ తగ్గింపు, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛ ఆంధ్ర, దీప్‌టెక్ వంటి అంశాలు ఉన్నాయి.

#ఈ పది సూత్రాలు అమలు ద్వారా 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, 55 లక్షల తలసరి ఆదాయం, జీరో పావర్టీ, 100% అక్షరాస్యత, మరియు 85 సంవత్సరాల ఆయుర్థాయం కలిగిన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ప్రధాన లక్ష్యం పెట్టుకోవడం జరిగింది.

#*జీరో పావర్టీ (Zero Poverty):* ఆంధ్రప్రదేశ్‌ను పేదరిక రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా P4 మోడల్ (Public–Private–People Partnership) ద్వారా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి యూనిట్‌గా మార్చే దిశగా చర్యలు చేపట్టబడ్డాయి. ఈ ఏడాది ఉగాది నాడు ప్రారంభించబడిన ఈ పథకం క్రింద బంగారు కుంటుంబాలు, మార్గదర్శిలను గుర్తించేందుకు మార్చి, జూలై లో ప్రత్యేక డ్రైవ్ లను నిర్వహించి 21 లక్షల కుటుంబాలను షార్టులిస్టు చేసి అందులో 10 లక్షల బంగారు కుటుంబాలను మరియు 1.00 లక్షల మార్గదర్శి ని గుర్తించడం జరిగింది.  

#*Family Benefit Management System (FBMS)*లో 1.02 కోట్ల కుటుంబాల వివరాలు నమోదు కాగా, 1.40 లక్షల కుటుంబాలకు ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పించబడ్డాయి. డిసెంబర్ 2025 నాటికి 72% డేటా సాట్యురేషన్ సాధించగా, మార్చి 2026 నాటికి 90% లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. 

#వచ్చే ఏడాది జనవరి నుండి మార్చి మద్య కాలంలో దాదాపు 10 లక్షల బంగారు కుటుంబాలు టైఅప్ అయ్యే విధంగా ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించడం జరుగుచున్నది. ఈ లక్ష్య సాధనలో ఎం.పి.డి.ఓ.లు, మున్సిఫల్ కమిషనర్లు కీలక భూమిక పోషించాలి, కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలి.  

#GSWS – బంగారు కుటుంబం అనుసంధానం రాష్ట్రంలో పేదరిక నిర్మూలన, సమాన అవకాశాలు, మరియు డేటా ఆధారిత పాలనకు దిశానిర్దేశం చేస్తూ స్వర్ణ ఆంధ్ర @2047 లక్ష్య సాధనకు బలమైన పునాది వేస్తోంది.

 

*(సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ సచివాలయం వారిచే జారీ)*

Search
Categories
Read More
Telangana
సిద్దిపేట్ కా షేర్ హరీష్ అన్న
హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్‌ ల్యాండ్...
By Ponnala Srinivasrao 2026-07-05 01:12:39 0 120
Telangana
ఆన్ లైన్ మోసానికి బలైన అల్వాల్ సీనియర్ సిటిజన్
  మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్ సర్కిల్‌లోని వెంకటాపురం డివిజన్‌కు...
By Sidhu Maroju 2025-08-24 10:04:35 0 549
Arunachal Pradesh
Flash Floods Devastate NEEPCO Colony in Keyi Panyor
The ongoing monsoon disaster in Arunachal Pradesh has severely crippled vital energy...
By Lokeshwari Panthadi 2026-07-01 09:24:06 0 70
Andhra Pradesh
గుంటూరు జిల్లాలో 53 లక్షల విలువైన సెల్ఫోన్లు రికవరీ.బాధితులకు అందించిన శ్రీ ఎస్పి వాకుల్ జిందల్ ఐపీఎస్ గారు
*గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 26.12.2025* _*//సుమారు రూ.53 లక్షల విలువైన 265 పోగొట్టుకున్న /...
By KOTESWARARAO KVSR 2025-12-27 02:46:28 0 285
Andhra Pradesh
బాడీ బిల్డింగ్ షెడ్డులో అగ్ని ప్రమాదం.. రూ. 1.5 లక్షల నష్టం.
మదనపల్లి- పుంగనూరు రోడ్డులోని బసినికొండ వద్ద ఉన్న బాబ్జాన్ బాడీ బిల్డింగ్ షెడ్డులో శుక్రవారం భారీ...
By Pagadala Venkateswar 2026-03-13 11:06:04 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com