దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం... బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు

0
176

దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం...
బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు

 

బాపట్ల: బాపట్ల జిల్లా కలెక్టర్ గారు మరియు డి ఎం హెచ్ ఓ గారి ఆదేశాల మేరకు కీటక జనిత వ్యాధుల నివారణే లక్ష్యంగా పనిచేస్తున్నామని, దోమ కాటు వల్ల ఏ ఒక్కరికి కూడా జ్వరం రాకూడదన్నది తమ ధ్యేయమని బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు అన్నారు.
ఈరోజు వెదుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ప్రభుత్వ బదిరుల హాస్టల్లో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మలాథియాన్ ఫోకల్ స్ప్రేయిoగ్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. బాపట్ల జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్స్ మరియు వెల్ఫేర్ హాస్టల్స్ లో జరుగుతున్నటువంటి ఈ ఇండోర్ రేసిడ్యుల్ స్ప్రే ద్వారా మలేరియా డెంగ్యూ బోదకాలు తదితర వ్యాధులను కలుగజేసే దోమలు పూర్తిగా చనిపోతాయని, కీటక జనిత వ్యాధులను నిర్మూలన అనుకున్న లక్ష్యంగా చేరువవడంలో ఈ కార్యక్రమం చాలా ముఖ్యమని అన్నారు. ప్రజలు కూడా పరిసరాలలో అనవసరపు నీటి నిల్వలు మరియు మురుగునీరు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడైనా మురుగునీరు నిల్వ  ఉన్న మరియు దోమ లార్వా పెరుగుదల ప్రదేశాలు ఉన్నా సంబంధిత ఆరోగ్య శాఖ కార్యకర్తలకు తెలియజేయాలని వారు పంచాయితీ సిబ్బంది సహకారంతో మురుగునీటిని తొలగించి దోమలను నిర్మూలించే కార్యక్రమాన్ని చేపడతారని చెప్పారు. కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి షకీల్, హెచ్ ఓ దిడ్ల ప్రసాదు సూపర్వైజర్ రవిశంకర్ హెల్త్ అసిస్టెంట్ చంద్రమోహన్ పాల్గొన్నారు  పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Himachal Pradesh
CM Sukhu Appeals to Punjab, Haryana for Himachal Projects |
CM Thakur Sukhwinder Singh Sukhu appealed to Punjab and Haryana to act as “elder...
By Pooja Patil 2025-09-15 11:49:58 0 467
Telangana
నిజామాబాద్: 27 వ డివిజాన్ లో చలివేంద్రం ప్రారంభం
నిజామాబాద్:ఈరోజు 27వ డివిజన్ వర్ని చౌరస్తాలో ఖిల్లా రామ్ మందిర్ ప్రధాన కార్యదర్శి కల్పే చిరంజీవి...
By Sadaq Sadaq 2026-04-19 12:04:32 0 82
Andhra Pradesh
మదనపల్లి: తాసిల్దార్ పై అవినీతి ఆరోపణలు
మదనపల్లె తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డిపై అక్రమ వసూళ్లు, ఆలస్యం ఆరోపణలు రావడంతో కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-04-06 04:14:18 0 126
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: బురదలో చిక్కుకొని ఇద్దరు చిన్నారులు మృతి.
అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం పట్రపల్లి తండాలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది....
By Pagadala Venkateswar 2026-05-13 05:51:37 0 52
Andhra Pradesh
కొంకుదురులో మహాశివరాత్రి వేడుకలు భక్తజనంతో కిటకిటలాడిన త్రిముఖ లింగేశ్వర స్వామి ఆలయం
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొంకుదురులోని శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత త్రిముఖ లింగేశ్వర...
By Ratna Sekhar 2026-02-19 20:24:23 0 799
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com