దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం... బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు

0
148

దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం...
బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు

 

బాపట్ల: బాపట్ల జిల్లా కలెక్టర్ గారు మరియు డి ఎం హెచ్ ఓ గారి ఆదేశాల మేరకు కీటక జనిత వ్యాధుల నివారణే లక్ష్యంగా పనిచేస్తున్నామని, దోమ కాటు వల్ల ఏ ఒక్కరికి కూడా జ్వరం రాకూడదన్నది తమ ధ్యేయమని బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు అన్నారు.
ఈరోజు వెదుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ప్రభుత్వ బదిరుల హాస్టల్లో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మలాథియాన్ ఫోకల్ స్ప్రేయిoగ్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. బాపట్ల జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్స్ మరియు వెల్ఫేర్ హాస్టల్స్ లో జరుగుతున్నటువంటి ఈ ఇండోర్ రేసిడ్యుల్ స్ప్రే ద్వారా మలేరియా డెంగ్యూ బోదకాలు తదితర వ్యాధులను కలుగజేసే దోమలు పూర్తిగా చనిపోతాయని, కీటక జనిత వ్యాధులను నిర్మూలన అనుకున్న లక్ష్యంగా చేరువవడంలో ఈ కార్యక్రమం చాలా ముఖ్యమని అన్నారు. ప్రజలు కూడా పరిసరాలలో అనవసరపు నీటి నిల్వలు మరియు మురుగునీరు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడైనా మురుగునీరు నిల్వ  ఉన్న మరియు దోమ లార్వా పెరుగుదల ప్రదేశాలు ఉన్నా సంబంధిత ఆరోగ్య శాఖ కార్యకర్తలకు తెలియజేయాలని వారు పంచాయితీ సిబ్బంది సహకారంతో మురుగునీటిని తొలగించి దోమలను నిర్మూలించే కార్యక్రమాన్ని చేపడతారని చెప్పారు. కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి షకీల్, హెచ్ ఓ దిడ్ల ప్రసాదు సూపర్వైజర్ రవిశంకర్ హెల్త్ అసిస్టెంట్ చంద్రమోహన్ పాల్గొన్నారు  పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు యల్.బి.స్టేడియం హైదరాబాద్ లో జులై 4 న కాంగ్రెస్ పార్టీ మహాసభను విజయ వంతం చేద్దాం రండి.!!
   క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్,  అందులో భాగంగా.....
By Sidhu Maroju 2025-07-02 06:53:20 0 1K
Andhra Pradesh
పుంగనూరు: ఎంపీ చొరవతో పిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు
వైయస్ఆర్సిపి లోక్ సభ పక్ష నేత, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటరెడ్డి తన...
By Kothuru Murali 2026-03-12 10:59:24 0 72
Andhra Pradesh
పుంగనూరు: బోయకొండ పాత బస్టాండు లోఆటో బోల్తా పడి 11 మంది భక్తులకు గాయాలు
శుక్రవారం పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, శ్రీ బోయకొండ గంగమ్మ దర్శనానికి వచ్చిన తెనాలి వలస...
By Kothuru Murali 2026-01-30 15:07:17 0 104
Andhra Pradesh
కలెక్టరేట్ వద్ద పోలీసుల తీరుపై సిపిఎం ఆగ్రహం.
అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి కలెక్టరేట్ కు...
By Pagadala Venkateswar 2026-02-28 06:40:53 0 76
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com