భారీ వర్షాల వల్ల ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించిన బిఆర్ఎస్ మాజీ మంత్రులు

0
268

సికింద్రాబాద్: ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ముంపుకు గురైన రాంగోపాల్ పేట్ లోని పలు ప్రాంతాలలో బిఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు నిత్యవసర సరుకులను అందజేశారు.వరద బాధితులకు సహాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ తన సొంతంగా పేద ప్రజలకు వరద బాధితులకు సహాయం చేయడం గొప్ప విషయమని ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలని అన్నారు. వరదల మూలంగా ప్రజలు గల్లంతైన పరిస్థితి ఏర్పడడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు.మున్సిపల్ శాఖ తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన సౌలభ్యం విషయంలో దృష్టి సారించలేకపోతున్నారని అన్నారు.

ముఖ్యమంత్రి వైఖరి అతని హోదాను తగ్గించే విధంగా ఉందని ఆక్షేపించారు.ఇప్పటికైనా వరద మంపు ప్రాంతాలలో బాధితులకు ఆర్థిక సహాయము నిత్యావసర సరుకులను పంపిణీ చేసి,నాలాల పూడిక తీత పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల విషయమై స్పందించిన హరీష్ రావు.  బహిరంగంగా పార్టీ కండువా మార్చుకుని పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు.బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలని కోరారు.  గ్రామ పంచాయతీలకు  నిధులు లేక గ్రామాలలో పాలన కుంటుపడిందని తెలిపారు.

  Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఏడు బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఏడు బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు సీఐ...
By Kothuru Murali 2026-01-11 11:27:17 0 129
Andhra Pradesh
సాయి శ్రీహరికృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించిన బేబినాయన
అమెరికాలో మరణించిన సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బేబినాయన సోమవారం...
By Boiena Rajesh 2026-04-13 13:42:36 0 114
Andhra Pradesh
పులివెందుల ZPTC ఉప ఎన్నికలు – MLA ఎన్నికల కంటే కఠినమైన భద్రత
ఆంధ్రప్రదేశ్‌ - పులివెందులలో జరగనున్న జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూయెన్సీ (ZPTC) ఉప...
By Bharat Aawaz 2025-08-11 18:22:55 0 708
Telangana
పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ :
సికింద్రాబాద్/సికింద్రాబాద్. సికింద్రాబాద్..   కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం...
By Sidhu Maroju 2025-07-26 08:15:12 0 852
Andhra Pradesh
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నిరుద్యోగుల లక్షల దోపిడీ.
అన్నమయ్య, రాయచోటి, మదనపల్లె ప్రాంతాలలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న...
By Pagadala Venkateswar 2026-03-01 04:19:08 0 109
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com