మన జైలు... శిక్షా కేంద్రమా లేక ఇది జీవితాలను నాశనం చేసే కారాగారమా?

0
786

మన జైలు... శిక్షా కేంద్రమా లేక ఇది జీవితాలను నాశనం చేసే కారాగారమా?

మనమంతా జైలు అనగానే తప్పు చేసినవాళ్లు శిక్ష అనుభవించే స్థలం అనుకుంటాం. కానీ, నిజానికి అక్కడ చాలామంది అమాయకులు శిక్ష అనుభవిస్తున్నారు. ఇది మన దేశానికి, మన న్యాయవ్యవస్థకు ఒక పెద్ద మచ్చ.

మీకు తెలుసా? మన జైళ్లలో దాదాపు 76% మంది ఇంకా నేరం నిరూపించబడని వాళ్లే. వాళ్లు కేవలం విచారణ కోసం మాత్రమే లోపల ఉన్నారు. వాళ్లు తప్పు చేశారో లేదో తెలియకముందే వాళ్ల జీవితాలు జైల్లో గడిచిపోతున్నాయి.

ఒక ఆర్మీ మేజర్ లాంటి గొప్ప అధికారి కూడా ఐదేళ్లు చేయని నేరానికి జైల్లో ఉన్నాడు. చివరికి నిర్దోషి అని తేలింది. కానీ, ఐదేళ్ల కాలాన్ని ఎవరు తిరిగి ఇవ్వగలరు? అదీ కాకుండా, బీహార్లో ఒక పేదవాడు ఏకంగా 40 ఏళ్లు జైల్లో గడిపాడు. అతని యవ్వనం, కలలు అన్నీ జైలు గోడల మధ్యే సమాధి అయ్యాయి.

దీనికి ఎవరు సమాధానం చెప్పాలి?

మన ఎగ్జిక్యూటివ్ సిస్టమ్నా,

మన జుడీషియరీ సిస్టమ్నా,

లేక మన రాజ్యాంగమా?

  మన దగ్గర కేసుల విచారణ చాలా నెమ్మదిగా జరుగుతుంది. న్యాయం వాయిదా పడితే, అది అన్యాయమే అవుతుంది.  మన జైళ్లలో ఖైదీల సంఖ్య చాలా ఎక్కువ. ఒకరికి ఉండే చోట నలుగురు ఉం టున్నారు.

  పేదవాళ్లు బెయిల్ కోసం డబ్బు కట్టలేక జైల్లోనే ఉండిపోతున్నారు. వాళ్లకు న్యాయ సహాయం కూడా అందడం లేదు.

పరిస్థితి మారాలంటే మనం మేల్కోవాలి. అన్యాయంపై గట్టిగా మాట్లాడాలి. ప్రతి ఒక్కరికీ సత్వర న్యాయం అందేలా మన వ్యవస్థలను సరిచేసుకోవాలి. మనం నిశ్శబ్దంగా ఉంటే, రేపు అన్యాయం మన కుటుంబాలకూ జరగవచ్చు. కనుక, గళం విప్పాలి. మన గళం అమాయకుల జీవితాలకు ఆశను నింపాలి.

జైలు అంటే కేవలం నేరస్థులకేనా? లేక అమాయకులను బలితీసుకునే ప్రదేశమా? దీనిపై మీ ఆలోచనలు ఏంటో తెలియజేయగలరు. Jai Hind

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:సదుం మండలంలో పేకాట రాయుళ్ల అరెస్ట్
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. సోమవారం రాత్రి సదుం ఎస్సై...
By Kothuru Murali 2026-02-17 08:39:19 0 91
Telangana
ఓటు వేయడం ప్రతి పౌరుడి బాధ్యత: తహశీల్దార్
ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఓటరు బాధ్యత అని కడెం తహసీల్దార్ ప్రభాకర్...
By Mittapelli Saketh 2026-01-25 08:31:06 0 472
Andhra Pradesh
ఇఫ్తార్ విందు ప్రాంగణంలో సామరస్యానికి ప్రతీకగా నాయకుల కలయిక
రాయచోటి రాష్ట్ర మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన ఇఫ్తార్ విందులో ప్రత్యేక...
By Benguluri Madhubabu 2026-03-16 05:32:27 0 139
Andhra Pradesh
యువ శక్తే మన బలం.. టెక్నాలజీయే మన ఆయుధం నేడు మాన్ కీ బాత్ లో ప్రధాన మంత్రి మోడీ
ప్రధానమంత్రినరేంద్రమోడీ నేడు నిర్వహించన 129వ మాన్ కీ బాత్ కార్యక్రమం లో దేశ ప్రజలు ను ఉద్దేశించి...
By Karapati Gopi 2025-12-28 10:02:43 0 269
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com