మన జైలు... శిక్షా కేంద్రమా లేక ఇది జీవితాలను నాశనం చేసే కారాగారమా?

0
558

మన జైలు... శిక్షా కేంద్రమా లేక ఇది జీవితాలను నాశనం చేసే కారాగారమా?

మనమంతా జైలు అనగానే తప్పు చేసినవాళ్లు శిక్ష అనుభవించే స్థలం అనుకుంటాం. కానీ, నిజానికి అక్కడ చాలామంది అమాయకులు శిక్ష అనుభవిస్తున్నారు. ఇది మన దేశానికి, మన న్యాయవ్యవస్థకు ఒక పెద్ద మచ్చ.

మీకు తెలుసా? మన జైళ్లలో దాదాపు 76% మంది ఇంకా నేరం నిరూపించబడని వాళ్లే. వాళ్లు కేవలం విచారణ కోసం మాత్రమే లోపల ఉన్నారు. వాళ్లు తప్పు చేశారో లేదో తెలియకముందే వాళ్ల జీవితాలు జైల్లో గడిచిపోతున్నాయి.

ఒక ఆర్మీ మేజర్ లాంటి గొప్ప అధికారి కూడా ఐదేళ్లు చేయని నేరానికి జైల్లో ఉన్నాడు. చివరికి నిర్దోషి అని తేలింది. కానీ, ఐదేళ్ల కాలాన్ని ఎవరు తిరిగి ఇవ్వగలరు? అదీ కాకుండా, బీహార్లో ఒక పేదవాడు ఏకంగా 40 ఏళ్లు జైల్లో గడిపాడు. అతని యవ్వనం, కలలు అన్నీ జైలు గోడల మధ్యే సమాధి అయ్యాయి.

దీనికి ఎవరు సమాధానం చెప్పాలి?

మన ఎగ్జిక్యూటివ్ సిస్టమ్నా,

మన జుడీషియరీ సిస్టమ్నా,

లేక మన రాజ్యాంగమా?

  మన దగ్గర కేసుల విచారణ చాలా నెమ్మదిగా జరుగుతుంది. న్యాయం వాయిదా పడితే, అది అన్యాయమే అవుతుంది.  మన జైళ్లలో ఖైదీల సంఖ్య చాలా ఎక్కువ. ఒకరికి ఉండే చోట నలుగురు ఉం టున్నారు.

  పేదవాళ్లు బెయిల్ కోసం డబ్బు కట్టలేక జైల్లోనే ఉండిపోతున్నారు. వాళ్లకు న్యాయ సహాయం కూడా అందడం లేదు.

పరిస్థితి మారాలంటే మనం మేల్కోవాలి. అన్యాయంపై గట్టిగా మాట్లాడాలి. ప్రతి ఒక్కరికీ సత్వర న్యాయం అందేలా మన వ్యవస్థలను సరిచేసుకోవాలి. మనం నిశ్శబ్దంగా ఉంటే, రేపు అన్యాయం మన కుటుంబాలకూ జరగవచ్చు. కనుక, గళం విప్పాలి. మన గళం అమాయకుల జీవితాలకు ఆశను నింపాలి.

జైలు అంటే కేవలం నేరస్థులకేనా? లేక అమాయకులను బలితీసుకునే ప్రదేశమా? దీనిపై మీ ఆలోచనలు ఏంటో తెలియజేయగలరు. Jai Hind

Search
Categories
Read More
Telangana
నేటి నుండి మూడు రోజులు "దుర్గాష్టమి-మహార్నవమి- విజయదశమి. (దసరా)
హైదరాబాద్: _🚩నేటి నుండి మూడు రోజులు దుర్గాష్టమి - మహర్నవమి - విజయ దశమి (దసరా)🚩_ "దుర్గాష్టమి"...
By Sidhu Maroju 2025-09-30 10:55:36 0 82
Telangana
2బీహెచ్‌కే ఇళ్ల కోసం లబ్ధిదారుల ఆందోళన |
నిర్మల్ జిల్లాలో 2బీహెచ్‌కే ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు పెద్ద ఎత్తున నిరసన...
By Bhuvaneswari Shanaga 2025-09-25 11:41:52 0 31
Andaman & Nikobar Islands
Islands Women's Rugby Team Shines at National Rugby Sevens Championship in Assam
Islands Women's Rugby Team Shines at National Rugby Sevens Championship in Assam The Andaman and...
By BMA ADMIN 2025-05-22 12:31:56 0 2K
Maharashtra
Trial Run Begins for Thane Metro Lines 4 & 4A |
Maharashtra Chief Minister Devendra Fadnavis, along with Deputy CM Eknath Shinde and Transport...
By Bhuvaneswari Shanaga 2025-09-22 11:01:04 0 48
Andhra Pradesh
ఖరీఫ్ లక్ష్యం 51 లక్షల టన్నులు: రైతులకు 48 గంటల్లో డబ్బు, WhatsApp రిజిస్ట్రేషన్ |
2025-26 ఖరీఫ్ సీజన్‌లో 51 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం భారీ...
By Meghana Kallam 2025-10-18 02:28:38 0 77
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com