మన జైలు... శిక్షా కేంద్రమా లేక ఇది జీవితాలను నాశనం చేసే కారాగారమా?

0
787

మన జైలు... శిక్షా కేంద్రమా లేక ఇది జీవితాలను నాశనం చేసే కారాగారమా?

మనమంతా జైలు అనగానే తప్పు చేసినవాళ్లు శిక్ష అనుభవించే స్థలం అనుకుంటాం. కానీ, నిజానికి అక్కడ చాలామంది అమాయకులు శిక్ష అనుభవిస్తున్నారు. ఇది మన దేశానికి, మన న్యాయవ్యవస్థకు ఒక పెద్ద మచ్చ.

మీకు తెలుసా? మన జైళ్లలో దాదాపు 76% మంది ఇంకా నేరం నిరూపించబడని వాళ్లే. వాళ్లు కేవలం విచారణ కోసం మాత్రమే లోపల ఉన్నారు. వాళ్లు తప్పు చేశారో లేదో తెలియకముందే వాళ్ల జీవితాలు జైల్లో గడిచిపోతున్నాయి.

ఒక ఆర్మీ మేజర్ లాంటి గొప్ప అధికారి కూడా ఐదేళ్లు చేయని నేరానికి జైల్లో ఉన్నాడు. చివరికి నిర్దోషి అని తేలింది. కానీ, ఐదేళ్ల కాలాన్ని ఎవరు తిరిగి ఇవ్వగలరు? అదీ కాకుండా, బీహార్లో ఒక పేదవాడు ఏకంగా 40 ఏళ్లు జైల్లో గడిపాడు. అతని యవ్వనం, కలలు అన్నీ జైలు గోడల మధ్యే సమాధి అయ్యాయి.

దీనికి ఎవరు సమాధానం చెప్పాలి?

మన ఎగ్జిక్యూటివ్ సిస్టమ్నా,

మన జుడీషియరీ సిస్టమ్నా,

లేక మన రాజ్యాంగమా?

  మన దగ్గర కేసుల విచారణ చాలా నెమ్మదిగా జరుగుతుంది. న్యాయం వాయిదా పడితే, అది అన్యాయమే అవుతుంది.  మన జైళ్లలో ఖైదీల సంఖ్య చాలా ఎక్కువ. ఒకరికి ఉండే చోట నలుగురు ఉం టున్నారు.

  పేదవాళ్లు బెయిల్ కోసం డబ్బు కట్టలేక జైల్లోనే ఉండిపోతున్నారు. వాళ్లకు న్యాయ సహాయం కూడా అందడం లేదు.

పరిస్థితి మారాలంటే మనం మేల్కోవాలి. అన్యాయంపై గట్టిగా మాట్లాడాలి. ప్రతి ఒక్కరికీ సత్వర న్యాయం అందేలా మన వ్యవస్థలను సరిచేసుకోవాలి. మనం నిశ్శబ్దంగా ఉంటే, రేపు అన్యాయం మన కుటుంబాలకూ జరగవచ్చు. కనుక, గళం విప్పాలి. మన గళం అమాయకుల జీవితాలకు ఆశను నింపాలి.

జైలు అంటే కేవలం నేరస్థులకేనా? లేక అమాయకులను బలితీసుకునే ప్రదేశమా? దీనిపై మీ ఆలోచనలు ఏంటో తెలియజేయగలరు. Jai Hind

Search
Categories
Read More
Andhra Pradesh
మహిళలకు 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు లోపు ఉన్న మహిళలకు, పెన్షన్ సౌకర్యం
కోడుమూరు లో ఘనంగా . ఉదయం నుండి ఎర్రజెండాలు పట్టణం పురవీధులలో కట్టి ,మహాసభ ప్రాంగణంలో ఎర్ర...
By mahaboob basha 2025-07-06 11:50:44 0 1K
Andhra Pradesh
అక్షర ఆంధ్ర గోడ పత్రికలు విడుదల చేసిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా మార్చడమే...
By Pagadala Venkateswar 2026-02-24 07:22:01 0 85
Andhra Pradesh
మైనర్ బాలురు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులే బాధ్యులని ఆయన హెచ్చరించారు
పుంగనూరు పట్టణంలో సీఐ సుబ్బరాయుడు, సిబ్బంది కలిసి శనివారం వాహనాల తనిఖీని నిర్వహించారు. జిల్లా...
By Kothuru Murali 2026-01-11 08:11:50 0 87
Andhra Pradesh
​బాధితులకు భరోసా: ప్రజా సమస్యల వేదికలో జిల్లా ఎస్పీ.
మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక'లో జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-03-10 04:37:54 0 82
Andhra Pradesh
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు, కోడి పందేలు, జూద స్థావరాల పై దాడులు నిర్వహిస్తున్న జిల్లా పోలీసులు.
బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్, ఐ.పి.యస్., గారి ఆదేశాల మేరకు, కోడి పందేలు, జూద స్థావరాల...
By Gadiyapudi Narendra 2026-01-10 16:36:19 0 278
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com