తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా

0
99

*తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా: లారీ ఢీకొని యువకుడికి గాయాలు.. స్థానికుల ఆందోళన!*

 

మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ మట్టి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండా పట్టపగలే నల్ల మట్టి లారీలు రోడ్లపై స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మానందపురంలో చోటుచేసుకున్న ప్రమాదం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

 

ఉండవల్లి ప్రాంతం నుండి మట్టి తరలింపునకు అనుమతులు లేనప్పటికీ, రవాణాదారులు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. పోలీసుల కళ్లు గప్పి ఎర్రబాలెం మీదుగా బ్రహ్మానందపురం చేరుకుని, అక్కడి నుండి హైవే ద్వారా విజయవాడ, ఇప్పటం, మెల్లెంపూడి వంటి ప్రాంతాలకు భారీగా మట్టిని తరలిస్తున్నారు. కేవలం రాజధాని గ్రామాలకు మాత్రమే మట్టి తరలింపునకు అనుమతులు ఉన్నట్లు తెలుస్తున్నా, ఆ ముసుగులో ఇతర ప్రాంతాలకు వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

 

ఉదయం బ్రహ్మానందపురంలో అతివేగంగా వెళ్తున్న ఒక మట్టి లారీ ఓ యువకుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడటంతో ఆగ్రహించిన స్థానికులు మట్టి లారీలను అడ్డుకున్నారు.

 

నిత్యం వందల సంఖ్యలో లారీలు తిరుగుతుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

సంబంధిత అధికారులు దీని పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో డ్రగ్ స్టోర్‌పై ఆకస్మిక తనిఖీ.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంఓ డాక్టర్ రాధిక బుధవారం డ్రగ్ స్టోర్‌ను ఆకస్మికంగా...
By Pagadala Venkateswar 2026-03-18 06:26:18 0 100
Andhra Pradesh
మహిళలు బాలికల రక్షణ దేయంగా పోలీసుల అవగాహన కార్యక్రమం
కృష్ణా జిల్లా పోలీస్    *మహిళలు, బాలికల రక్షణే ధ్యేయంగా రక్షణ చట్టాలు మరియు మాదక...
By Rajini Kumari 2026-02-23 14:11:57 0 126
Andhra Pradesh
నాటు సారా, నకిలీ మద్యం నియంత్రణపై కఠిన చర్యలు: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో నాటు సారా, నకిలీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-29 07:34:37 0 90
Andhra Pradesh
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు : కర్నూలు జిల్లా ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లాజనవరి 26 వ తేదీ సోమవారం నిర్వహించే "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక...
By Hari Krishna 2026-01-24 12:59:46 0 265
Andhra Pradesh
మదనపల్లె: కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె మండలం, మాలెపాడు దేవలంపల్లికి చెందిన గణప్రసాద్ (35) కుటుంబ కలహాల కారణంగా పురుగుమందు తాగి...
By Pagadala Venkateswar 2026-01-06 07:24:40 0 159
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com