శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ & ప్రెస్ మీట్

0
1K

ఆనంద్ బాగ్ శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఆలయ అర్చకులు, అభివృద్ధి కమిటీ సభ్యులు శుక్రవారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.

బ్రహ్మోత్సవాలు: ఆగస్టు 5, 2025 (మంగళవారం) నుండి ఆగస్టు 9, 2025 (శనివారం) వరకు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎ.బి. రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి.

ప్రధాన కార్యక్రమాలు:

ఆగస్టు 5: కోయిల అల్వార్ తిరుమంజనం, విష్ణు సహస్రనామ పారాయణం, పల్లకి సేవ, అంకురార్పణ.
ఆగస్టు 6: గరుడ హోమం.
ఆగస్టు 7: ఎదుర్కోళ్ళు, స్వామివారి కల్యాణ మహోత్సవం, హనుమత్ సేవ, రథోత్సవం.
ఆగస్టు 8: సుదర్శన హోమం, మహా పూర్ణాహుతి, చక్రస్నానం, వసంతోత్సవం, శ్రీ పుష్పయాగం.
ఆగస్టు 9: ఉత్సవాంత స్నపనం, ఆచార్య ఋత్విక్ సన్మానం.

ఆలయ ప్రధాన అర్చకులు ముడుంబై వెంకట రమణాచార్యులు మాట్లాడుతూ, ఆలయంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అర్చకులు, క్లార్క్, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
హైదరాబాద్: సికింద్రాబాద్ లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,...
By Sidhu Maroju 2025-09-16 16:52:28 0 92
Sports
బుమ్రా తర్వాత సిరాజ్‌నే.. టెస్ట్‌లో భారత గర్వం |
భారత టెస్ట్ బౌలింగ్ విభాగంలో మరో గర్వకారణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మియాన్‌...
By Bhuvaneswari Shanaga 2025-10-09 07:43:39 0 28
Telangana
హైకోర్టు సంచలన తీర్పు - సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి
    సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి.స్థానిక సంస్థల...
By Sidhu Maroju 2025-06-25 05:57:54 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com