విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోడి

0
1K

గుజరాత్ లోని అహ్మదాబాద్, విమానాశ్రయం నుండి టేకప్ అయిన కొద్దిసేపటికే లండన్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానం గురు వారం మధ్యాహ్నం ఏఐ -171 కుప్పకూలింది, ఈ ఘటనలో దాదాపు 265 మంది మరణించారు. అందులో ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు ఈ ప్రమాదం దశాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా అధికారులు వర్ణిస్తున్నారు.ఎయిరిండియా విమానం కూలిన ఘటన యావత్ భారత దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం 229 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఫ్లైట్ బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్‌పై పడటంతో మరో 24 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ,ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు కాసేపటి క్రితం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రమాదం జరిగిన మేఘాని నగర్‌ ఘోడాసర్‌ క్యాంప్‌ ప్రాంతానికి వెళ్లారు. ప్రధాని తో పాటు ఆయన వెంట కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు 

Search
Categories
Read More
Telangana
లక్ష్మి ఎన్ క్లేవ్ కాలనీలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి.|
మల్కాజ్గిరి జిల్లా :  ఆల్వాల్ డివిజన్ 133 డివిజన్ కార్పొరేటర్ తో కలసి లక్మి ఎన్ క్లేవ్...
By Sidhu Maroju 2025-12-01 12:11:31 0 175
Andhra Pradesh
ప్రగతి బాటలో పల్లెలు
ప్రగతి బాటలో పల్లెలు.   పరుగులు పెడుతున్న అభివృద్ధి.   -మైలవరం ఎమ్మెల్యే వసంత...
By Rajini Kumari 2026-04-17 15:17:38 0 82
Andhra Pradesh
ప్రధాని ముఖ్యమంత్రి సూచనలతో ఇంధన పొదుపు కార్యక్రమాన్ని చేపట్టిన మిల్క్ యూనియన్ చైర్మన్ ఆంజనేయులు
కృష్ణా   *ప్రధాని, ముఖ్యమంత్రి సూచనలతో ఇంధన పొదుపు చర్యలు చేపట్టిన కృష్ణా మిల్క్ యూనియన్...
By Rajini Kumari 2026-05-16 14:56:14 0 63
Andhra Pradesh
Pawan Kalyan: అమరావతిలో తొలిసారి నిర్వహించిన గణతంత్ర వేడుకలు అద్భుతం: పవన్ కల్యాణ్.
ఈ వేడుకలు రాష్ట్ర భవిష్యత్ లక్ష్యాలకు అద్దం పట్టాయన్న పవన్ సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి...
By Pagadala Venkateswar 2026-01-26 11:16:46 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com