విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోడి

0
1K

గుజరాత్ లోని అహ్మదాబాద్, విమానాశ్రయం నుండి టేకప్ అయిన కొద్దిసేపటికే లండన్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా విమానం గురు వారం మధ్యాహ్నం ఏఐ -171 కుప్పకూలింది, ఈ ఘటనలో దాదాపు 265 మంది మరణించారు. అందులో ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు ఈ ప్రమాదం దశాబ్దంలో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా అధికారులు వర్ణిస్తున్నారు.ఎయిరిండియా విమానం కూలిన ఘటన యావత్ భారత దేశాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం 229 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఫ్లైట్ బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్‌పై పడటంతో మరో 24 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ,ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు కాసేపటి క్రితం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్‌ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రమాదం జరిగిన మేఘాని నగర్‌ ఘోడాసర్‌ క్యాంప్‌ ప్రాంతానికి వెళ్లారు. ప్రధాని తో పాటు ఆయన వెంట కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
తస్మాత్ జాగ్రత్త ప్రజలారా??????
*💥తస్మాత్ జాగ్రత్త ప్రజలారా.....????*   హోటల్స్ కర్రి పాయింట్స్ లో కూరలు కొంటూ భోజనం...
By Rajini Kumari 2025-12-27 10:23:56 0 104
Telangana
నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్ ప్రెస్ మీట్.|
సికింద్రాబాద్ : ఉత్తర మండల పరిధిలోని కార్ఖానా, బొల్లారం పోలీస్ స్టేషన్ లలో ఇళ్లలో దొంగతనాలకు...
By Sidhu Maroju 2025-12-16 10:54:14 0 122
Telangana
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓయో రూంలో యువకుని ఆత్మహత్య
నిన్న రాత్రి సమయంలో శరీరం కుళ్లిన వాసన రావడంతో, పోలీస్ లకు సమాచారం ఇచ్చిన ఓయో హోటల్ యాజమాన్యం....
By Sidhu Maroju 2025-06-22 15:33:37 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com