అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ...ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతులను చేపట్టి పూర్తిచేస్తాం : బిఆర్ ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్.

0
1K

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 22వ వార్డుకు చెందిన డ్రీమ్ వ్యాలీ, ఇందిరమ్మ కాలనీ ఫేస్ - 1, గ్రీన్ పార్క్ కాలనీవాసులు మాజీ వార్డు సభ్యులు సంధ్యా హనుమంతరావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారిని కలిసి ఆయా కాలనీలలో మాలిక వసతులు అన్ని దాదాపు పూర్తయ్యాయని, అక్కడక్కడ మిగిలిపోయిన సిసి రోడ్డు నిర్మాణం, డ్రీమ్ వ్యాలీ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు లింక్ రోడ్డు ఏర్పాటు, ఇందిరమ్మ కాలనీ ఫేస్ -1 లో మంచినీటి స్టోరేజ్ కోసం వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే  మాట్లాడుతూ.... నగర శివారు మున్సిపాలిటీ లైన దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీలలో ప్రాధాన్యత క్రమంలో మౌలిక వసతుల కల్పన చేపట్టడం జరిగిందని, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ఇంకేమైనా పనులు మిగిలిపోయి ఉంటే త్వరలోనే చేపట్టి పూర్తి చేస్తామన్నారు. అనంతరం సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడిన ఎమ్మెల్యే గారు మౌలిక వసతులైన సిసి రోడ్డు, వాటర్ ట్యాంక్, లింకు రోడ్డు పనులను త్వరీతగతిన చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
టీడీపీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం విజయవంతం.
మదనపల్లె పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో నెలవారీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం బుధవారం ఘనంగా...
By Pagadala Venkateswar 2026-06-25 05:59:04 0 53
Andhra Pradesh
శ్రీ పట్టాభిరామస్వామి ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు
శ్రీ పట్టాభిరామస్వామి ధ్వజ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న Dr. గొట్టిపాటి లక్ష్మీ గారు. తాళ్లూరు...
By Chennaiah Kati 2026-06-29 05:39:15 0 49
Uncategorized
Market Shift: The Real Value of Music Catalogs
The gold rush for iconic song catalogs is entering a highly analytical era. Financial data...
By Dunna Jessicaruth 2026-05-19 07:20:52 0 81
Andhra Pradesh
దశాబ్దాలుగా వెంటాడుతున్న తాగునీటి సమస్యను పరిష్కరించిన కేసినేని చిన్ని
*ప్ర‌చుర‌ణార్థం* *28-02-2026*   *దశాబ్దాలుగా వెంటాడుతున్న సమస్యకు ఎంపీ కేశినేని...
By Rajini Kumari 2026-02-28 12:56:30 0 148
Andhra Pradesh
స్వాతంత్ర్యం వచ్చాక ఇదే తొలిసారి: కూటమి ప్రభుత్వంపై మహానాడులో ట్రాన్స్‌జెండర్ వర్షిణి ప్రశంసలు.
కూటమి ప్రభుత్వం తమ జీవితాల్లో వెలుగులు నింపిందని వ్యాఖ్య గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి...
By Pagadala Venkateswar 2026-05-28 07:14:50 0 75
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com