జూలై 1న జాతీయ కార్మిక సంఘాల సంయుక్త నిరసన కార్యక్రమాలు

0
180

గోదావరిఖని : కోల్ ఇండియా స్థాయిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఫెడరేషన్లు సంయుక్తంగా సమావేశమై JBCCI-12వ వేతన ఒప్పందం ఏర్పాటు మరియు కార్మికుల సమస్యలపై కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో, సింగరేణిలో ఆయా ఫెడరేషన్లకు చెందిన INTUC, AITUC, CITU, HMS సంఘాల నాయకులు సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC)గా ఏర్పడి జూలై 1న నిర్వహించనున్న కార్యక్రమాలపై గోదావరిఖనిలో కార్యాచరణ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు,ఈ సమావేశంలో INTUC నుండి డా. బి. జనక్ ప్రసాద్, నరసింహారెడ్డి, ధర్మపురి, AITUC నుండి వాసిరెడ్డి సీతారామయ్య, మడ్డి ఎల్లయ్య, CITU నుండి రాజిరెడ్డి, రాజమౌళి, HMS నుండి సారయ్య, అనిల్ రెడ్డి పాల్గొన్నారు,ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయాలని ప్రయత్నిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మిక వ్యతిరేకమైన ఈ నాలుగు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు,అలాగే బొగ్గు పరిశ్రమ కార్మికులకు అత్యంత కీలకమైన JBCCI-12వ వేతన ఒప్పందం ప్రక్రియను లేబర్ కోడ్‌ల పేరుతో జాప్యం చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు కోల్ ఇండియా యాజమాన్యం వెంటనే JBCCI-12వ వేతన ఒప్పందానికి సంబంధించిన చర్చలు ప్రారంభించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు,సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు మరియు JBCCI-12వ వేతన ఒప్పందం తక్షణ ప్రారంభం కోసం జూలై 1న సంయుక్తంగా భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

జూన్ 29,శ్రీరాంపూర్ – గేట్ మీటింగ్, విలేకరుల సమావేశం భూపాలపల్లి – గేట్ మీటింగ్, విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు,

జూన్ 30,కొత్తగూడెం – గేట్ మీటింగ్, విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు,

జూలై 1,కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద భారీ నిరసన కార్యక్రమం,అనంతరం విలేకరుల సమావేశంలో,జేఏసీ నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Telangana
ప్రిన్సిపాల్ ను సత్కారించిన అధ్యాపకులు
మహబూబాబాద్/కొత్తగూడ, భారత్ అవాజ్, ఫిబ్రవరి 3: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల...
By Bheeshman King 2026-02-03 13:57:12 0 361
Andhra Pradesh
'పోర్ట్‌కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలి'
పోర్ట్కు పోదాం కార్యక్రమం జయప్రదం చేయాలని జిల్లా వైసీపీ నాయకులు పీరుపల్లి రాజశేఖర్ అన్నారు....
By Manda Ramkumar 2026-03-28 06:28:37 0 455
Andhra Pradesh
ఒక నాయకుడు చేసిన పాదయాత్ర రాష్ట్ర చరిత్రనే తిరగరాసింది
https://x.com/i/status/2042053956826984748   ఒక నాయ‌కుడు చేసిన పాద‌యాత్ర రాష్ట్ర...
By Rajini Kumari 2026-04-10 06:31:42 0 125
SURAKSHA
Alok Kumar, IPS: A Visionary Leader in Modern Policing
A distinguished 1994-batch IPS officer whose commitment to technology-driven policing, public...
By Lokeshwari Panthadi 2026-07-18 11:31:39 0 50
Andhra Pradesh
కల్తీ నెయ్యి కేసు....ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు
AP: తిరుమలకు 2019-24 మధ్య కల్తీ నెయ్యి సరఫరా అయినా టీటీడీ అడ్డుకోలేకపోయిందని నెల్లూరు కోర్టులో...
By Pagadala Venkateswar 2026-01-23 11:34:06 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com