జూలై 1న జాతీయ కార్మిక సంఘాల సంయుక్త నిరసన కార్యక్రమాలు

0
179

గోదావరిఖని : కోల్ ఇండియా స్థాయిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఫెడరేషన్లు సంయుక్తంగా సమావేశమై JBCCI-12వ వేతన ఒప్పందం ఏర్పాటు మరియు కార్మికుల సమస్యలపై కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించిన నేపథ్యంలో, సింగరేణిలో ఆయా ఫెడరేషన్లకు చెందిన INTUC, AITUC, CITU, HMS సంఘాల నాయకులు సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC)గా ఏర్పడి జూలై 1న నిర్వహించనున్న కార్యక్రమాలపై గోదావరిఖనిలో కార్యాచరణ సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు,ఈ సమావేశంలో INTUC నుండి డా. బి. జనక్ ప్రసాద్, నరసింహారెడ్డి, ధర్మపురి, AITUC నుండి వాసిరెడ్డి సీతారామయ్య, మడ్డి ఎల్లయ్య, CITU నుండి రాజిరెడ్డి, రాజమౌళి, HMS నుండి సారయ్య, అనిల్ రెడ్డి పాల్గొన్నారు,ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయాలని ప్రయత్నిస్తూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మిక వ్యతిరేకమైన ఈ నాలుగు నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు,అలాగే బొగ్గు పరిశ్రమ కార్మికులకు అత్యంత కీలకమైన JBCCI-12వ వేతన ఒప్పందం ప్రక్రియను లేబర్ కోడ్‌ల పేరుతో జాప్యం చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరియు కోల్ ఇండియా యాజమాన్యం వెంటనే JBCCI-12వ వేతన ఒప్పందానికి సంబంధించిన చర్చలు ప్రారంభించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు,సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు మరియు JBCCI-12వ వేతన ఒప్పందం తక్షణ ప్రారంభం కోసం జూలై 1న సంయుక్తంగా భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

జూన్ 29,శ్రీరాంపూర్ – గేట్ మీటింగ్, విలేకరుల సమావేశం భూపాలపల్లి – గేట్ మీటింగ్, విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు,

జూన్ 30,కొత్తగూడెం – గేట్ మీటింగ్, విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు,

జూలై 1,కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వద్ద భారీ నిరసన కార్యక్రమం,అనంతరం విలేకరుల సమావేశంలో,జేఏసీ నాయకులు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వారపు సంత వేలం రికార్డు
చింతూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ వారపు సంత వేలంపాట శనివారం ఉత్సాహంగా జరిగింది. పంచాయతీ...
By Shyamala Yadagiri 2026-03-28 14:47:28 0 279
Business & Finance
Design Registration Protects the Look of Your Product
A design registration protects the unique appearance, shape, pattern, or ornamentation of your...
By Navya Sree 2026-07-18 07:20:04 0 40
Telangana
రేషన్ బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు: తహసిల్దార్
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు పంపిణీ చేసే ఉచిత రేషన్ బియ్యం ఎవరైనా దళారులకు అమ్మితే చట్ట ప్రకారం...
By Katiyala JeevanRaj 2026-03-31 05:02:35 0 354
Andhra Pradesh
కార్మికుల ఉన్నతికి అత్యంత ప్రాధాన్యత : మున్సిపల్ కమిషనర్
కర్నూలు సిటీ : కార్మికుల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-01 16:10:40 0 236
Andhra Pradesh
వైయస్సార్సీపి రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి గడ్డం నారాయణరెడ్డి
ఎమ్మిగనూరు పట్టణంలోని 'కోతుల బావి' ఆంజనేయ స్వామి ఆలయ భూమి వివాదానికి మున్సిపల్ కమిషనర్...
By Boya Dasthagiri 2026-05-19 09:13:43 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com