చీరాల ఎగ్జిబిషన్‌లో ధరల 'దోపిడీ'.. కలుషిత ఆహారంతో ప్రజల ఆరోగ్యం విలవిల!

0
66

చీరాల

పాత పట్టణంలోని పాత భవాని థియేటర్ ఆవరణలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న 'అనిత ట్రేడ్ ఫెర్ రోబోటిక్ ఫిష్ టన్నల్' ఎగ్జిబిషన్ సందర్శకుల పాలిట శాపంగా మారింది. వినోదం పేరుతో యాజమాన్యం సామాన్య ప్రజల జేబులకు చిల్లు పెడుతూ,మరోపక్క నాణ్యత లేని ఆహారంతో ప్రాణాలతో చెలగాటమాడుతోందని సందర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టికెట్ నుంచి ఆటల వరకు అంతా వసూళ్లే

ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ టికెట్, పార్కింగ్ ధరల దగ్గరి నుంచే వసూళ్లు మొదలవుతున్నాయి. లోపల ఏర్పాటు చేసిన ఫ్యాన్సీ స్టాళ్లలో నాణ్యత లేని వస్తువులను సైతం 'ఫిక్స్‌డ్ రేట్' పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక వినోదం కోసం ఏర్పాటు చేసిన జెయింట్ వీల్, కొలంబస్, డ్రాగన్ ట్రైన్ వంటి వాటి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కో రైడ్‌కు భారీగా వసూలు చేస్తున్న యాజమాన్యం, కనీసం పది నిమిషాలు కూడా తిప్పకుండా కేవలం రెండు, మూడు నిమిషాల్లోనే ముగించేస్తూ పిల్లలను, పెద్దలను దించేస్తున్నారు.

రంగులమయమైన 'కలుషిత' ఆహారం

ఎగ్జిబిషన్‌లోని ఫుడ్ కోర్టుల పరిస్థితి చూస్తే ప్రజలు హడలిపోతున్నారు. నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా వంటి పదార్థాలలో విపరీతమైన రంగులు కలుపుతూ ప్రజల ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు. వంట చేసే ప్రదేశంలో కనీస శుభ్రత లేకపోవడమే కాకుండా, ఈగలు ముసురుతున్న వాతావరణంలోనే వంటలు సాగుతున్నాయి. అధిక ధరలు పెట్టి కొన్నా కూడా కనీస నాణ్యత లేకపోవడంతో ప్రజలు వేదన వ్యక్తం చేస్తున్నారు.

పట్టణ నడిబొడ్డున ఇంత దారుణంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నా, అనుమతులిచ్చిన అధికారులు పర్యవేక్షించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.

 ధరల నియంత్రణ ఏది

   అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, ఎగ్జిబిషన్ ప్రాంగణంలో తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పించాలని, అధిక వసూళ్లకు పాల్పడుతున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని చీరాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
ప్రజా సమస్యలపై జోనల్ కమిషనర్‌ను కలిసిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న పలు అత్యవసర పౌర సమస్యలపై మాజీ...
By Sidhu Maroju 2026-03-16 09:28:01 0 120
Andhra Pradesh
ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఏఐఎస్ఎఫ్ నాయకులు హెచ్చరించారు
ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యస్ షాబీర్ భాష ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు...
By Boya Dasthagiri 2026-05-06 15:44:27 0 89
BMA
"Break Their Legs" Order Raises Serious Concerns Over Police Brutality in Bhubaneswar
On June 29, 2025, Additional Commissioner of Bhubaneswar was caught on camera instructing...
By Citizen Rights Council 2025-06-30 08:54:59 0 2K
Andhra Pradesh
శ్రీకాకుళం: 'దళిత వ్యతిరేక తీర్పులను అడ్డుకోవాలి'
కులాంతర నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణయ్య గారు శ్రీకాకుళంలో జరిగిన కార్యవర్గ...
By Manda Ramkumar 2026-03-27 12:43:18 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com