Madanapalle: మదనపల్లెలో దళిత నేత శ్రీచందు అక్రమ అరెస్టును ఖండించిన దళిత సంఘాలు. తప్పుడు కేసులు పెట్టిన సీఐ కళా వెంకటరమణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.

0
54

మదనపల్లె: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పోలీసు రాజ్యం నడుస్తోందని దళిత సంఘాల నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. దళిత నేత, బహుజన సేన అధ్యక్షుడు శ్రీచందును తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడాన్ని ఖండిస్తూ గురువారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భారతీయ అంబేడ్కర్ సేన (బాస్) వ్యవస్థాపకుడు పీటీయం శివప్రసాద్,

 

సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎం. బాలాజీ, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలకుంట శ్రీనివాసులు, రాష్ట్ర గిరిజన సమాఖ్య అధ్యక్షుడు కోనేటి దివాకర్‌రావు, బహుజన సేన ప్రతినిధి భానుప్రకాశ్ పాల్గొని మాట్లాడారు.

 

శ్రీచందుపై నమోదు చేసిన కేసులో నేరం జరిగిన తేదీ, సమయం, స్థలం వంటి ప్రాథమిక వివరాలు కూడా లేకుండానే కేసు నమోదు చేశారని, ఫిర్యాదుదారుతో మాట్లాడకుండానే దళిత నాయకుడిని అరెస్ట్ చేయడం చట్టవిరుద్ధమని ఆరోపించారు. కేసు నమోదు చేసిన స్టేషన్ హౌస్ ఆఫీసర్, దర్యాప్తు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: ₹92 లక్షల సైబర్ కేసును ఛేదించిన పోలీసులు.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం, గత ఏడాది ఓ న్యాయవాదిని మోసం చేసి రూ.92 లక్షలు...
By Pagadala Venkateswar 2026-04-07 03:58:25 0 138
Andhra Pradesh
ఆ నౌకల్ని అడ్డుకుంటున్నాం అమెరికా సెంట్ కాన్ ప్రకటన
*ఆ నౌకలనే అడ్డుకుంటున్నాం: అమెరికా సెంట్ కామ్ ప్రకటన*    ఇరాన్ ఓడరేవులపై అమెరికా...
By Rajini Kumari 2026-04-15 13:26:57 0 150
Telangana
శ్రీనివాస్ కుటుంబానికి అండగా DTF
మహబూబాబాద్/కొత్తగూడ:: సర్పంచ్ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా బ్రెయిన్...
By Bheeshman King 2026-04-11 12:43:41 0 1K
SURAKSHA
AP Retired Cops: Guardians Of Road Safety Now
Yesterday retire అయిన AP police officers road safety guardians గా కొనసాగుతున్నారు. School zones,...
By Kalaga Sailaja 2026-07-03 13:30:42 0 61
Telangana
వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ ని ఆవిష్కరించిన ఎంమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా వాలీ బాల్ టోర్నమెంట్ పోస్టర్ల ను ఆవిష్కరించిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల...
By Avunoori Mahesh 2026-04-12 07:00:08 0 147
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com