విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. మోదీ, చంద్రబాబుకు లోకేష్ ధన్యవాదాలు.

0
96

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై గెజిట్ విడుదల

ఏపీ చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్న మంత్రి నారా లోకేశ్

ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు

సీఎం చంద్రబాబు నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందని వెల్లడి

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కనెక్టివిటీలో ఒక చారిత్రక ఘట్టమని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిన ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు గణనీయంగా బలపడతాయని, రైళ్ల నిర్వహణ సామర్థ్యం కూడా పెరుగుతుందని లోకేష్ పేర్కొన్నారు. ఈ మైలురాయి ద్వారా ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని, కనెక్టివిటీ మెరుగుపడి ప్రజలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఈ రైల్వే జోన్ ఏర్పాటును సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేశారని నారా లోకేష్ గుర్తుచేశారు. ఆయన పట్టుదల వల్లే ఈ కల నెరవేరిందని, ఇందుకుగాను ముఖ్యమంత్రికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు లోకేష్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జాతీయస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను సన్మానించిన కర్నూల్ ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా...జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో గెలుపు పొందిన కర్నూలు...
By Hari Krishna 2026-01-02 15:29:55 0 223
Andhra Pradesh
కాపుల ద్రోహి వైయస్సార్సీపి అన్నమయ్య జిల్లా బలిజ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గండికోట సుధాకర్
*కాపుల ద్రోహి వైఎస్సార్‌        రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ...
By Benguluri Madhubabu 2026-06-25 11:34:59 0 112
Andhra Pradesh
ఈడిగపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం
పుంగనూరు మండలం, ఈడిగపల్లి గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి...
By Kothuru Murali 2025-12-30 13:02:45 0 355
Telangana
పేద ప్రజల వైద్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ : ఎమ్మెల్యే శ్రీ గణేష్
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  నిమ్స్ హాస్పటల్ లో వైద్య ఖర్చుల కోసం...
By Sidhu Maroju 2025-09-09 14:46:45 0 334
Business & Finance
Rural Road Expansion to Boost Bihar's Business Growth
The newly completed roads under the Pradhan Mantri Gram Sadak Yojana (PMGSY) are expected to...
By Navya Sree 2026-07-01 07:10:04 0 48
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com