విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. మోదీ, చంద్రబాబుకు లోకేష్ ధన్యవాదాలు.

0
64

విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై గెజిట్ విడుదల

ఏపీ చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్న మంత్రి నారా లోకేశ్

ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు కృతజ్ఞతలు

సీఎం చంద్రబాబు నిరంతర కృషితోనే ఇది సాధ్యమైందని వెల్లడి

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కనెక్టివిటీలో ఒక చారిత్రక ఘట్టమని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిన ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

ఈ నిర్ణయంతో రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలు గణనీయంగా బలపడతాయని, రైళ్ల నిర్వహణ సామర్థ్యం కూడా పెరుగుతుందని లోకేష్ పేర్కొన్నారు. ఈ మైలురాయి ద్వారా ప్రాంతీయ అభివృద్ధి వేగవంతం అవుతుందని, కనెక్టివిటీ మెరుగుపడి ప్రజలకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఈ రైల్వే జోన్ ఏర్పాటును సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం కృషి చేశారని నారా లోకేష్ గుర్తుచేశారు. ఆయన పట్టుదల వల్లే ఈ కల నెరవేరిందని, ఇందుకుగాను ముఖ్యమంత్రికి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు లోకేష్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
ADB: రిమ్స్ లో బాలింత మృతి.. ఏడుగురిపై చర్యలు
రిమ్స్లో ఉట్నూర్ మండలం పిట్లగూడకు ఆదివాసీ మహిళ గంగశీల మృతి ఘటనలో ఏడుగురు సిబ్బందిపై జిల్లా...
By Mitappaly Shiavji 2026-01-01 04:00:48 0 440
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి ఎంపీ ల్యాండ్ నిధులు...
By Kothuru Murali 2026-01-20 14:21:58 0 152
Andhra Pradesh
వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
వీధి కుక్కల దాడులపై సుప్రీం కోర్టు సంచ‌ల‌న ఆదేశాలు   వీధి కుక్క‌ల దాడులు...
By Rajini Kumari 2026-01-14 12:34:23 0 146
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com