ఎమ్మిగనూరు బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో

0
113

ఎమ్మిగనూరు ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (AP SERP) ఆధ్వర్యంలో గ్రామ సంఘ సహాయకులు (VOA)లకు 5G సదుపాయం కలిగిన స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గ్రామ సంఘ సహాయకులను డిజిటల్‌గా శక్తివంతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 28,500 5G స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ చర్య ద్వారా గ్రామీణ కమ్యూనికేషన్ బలోపేతం అవడంతో పాటు, స్వయం సహాయక సంఘాల (SHGs) సేవల అమలు మరింత సమర్థవంతంగా జరుగుతుందని చెప్పారు.

ఈ స్మార్ట్‌ఫోన్ల ద్వారా VOAs తమ SHG సభ్యుల డేటా, రుణాలు, సంక్షేమ పథకాల వివరాలను రియల్ టైమ్‌లో నిర్వహించగలరని, ఇప్పటివరకు ఉన్న మాన్యువల్ విధానాన్ని తొలగించి పారదర్శకత మరియు వేగాన్ని పెంచుతుందని తెలిపారు. మహిళల ఆధ్వర్యంలోని సంఘ వ్యవస్థలను బలోపేతం చేయడం, గ్రామీణ స్థాయి సిబ్బందికి మెరుగైన పనివాతావరణం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మూడు మండలాల APOలు మరియు సిబ్బంది, ఏఎంసీ చైర్మన్, టీడీపీ నాయకులు, గ్రామ సంఘ సహాయకులు (VOAs) మరియు స్వయం సహాయక సంఘ మహిళలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
అక్రడేషన్ కార్డు జీవో విడుదల
మహబూబాబాద్, డిసెంబర్ 23(భారత్ అవాజ్): రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్...
By Bittu Bittu 2025-12-23 04:38:28 0 441
Telangana
ఎన్. రాంచందర్ రావ్, ఇప్పుడు తెలంగాణలో ఈ పేరు మారుమోగుతోంది. ఇంతకీ ఈ ఎన్. రాంచందర్ రావ్ ఎవరంటే..!
హైదరాబాద్ కు చెందిన నరపరాజు రాంచందర్ రావు రాజనీతి శాస్త్రంలో ఎంఏతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ...
By Sidhu Maroju 2025-07-01 06:07:57 0 1K
Maharashtra
साहित्य संमेलनात अनुवादकाला अध्यक्षपद देण्याची मागणी
अनुवादक मंच या संस्थेने राज्यात वाढत्या #अनुवाद साहित्याच्या लोकप्रियतेचा दाखला देत एक महत्त्वाची...
By Pooja Patil 2025-09-13 05:31:44 0 186
Telangana
ఫ్యూచర్ సిటీని ప్రత్యేక కమిషనరేట్ గా మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.|
   హైదరాబాద్ :  రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజిగిరి కమిషనరేట్‌గా మార్పు,...
By Sidhu Maroju 2025-12-29 18:05:02 0 150
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com