ఎమ్మిగనూరు బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో

0
114

ఎమ్మిగనూరు ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (AP SERP) ఆధ్వర్యంలో గ్రామ సంఘ సహాయకులు (VOA)లకు 5G సదుపాయం కలిగిన స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గ్రామ సంఘ సహాయకులను డిజిటల్‌గా శక్తివంతం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 28,500 5G స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ చర్య ద్వారా గ్రామీణ కమ్యూనికేషన్ బలోపేతం అవడంతో పాటు, స్వయం సహాయక సంఘాల (SHGs) సేవల అమలు మరింత సమర్థవంతంగా జరుగుతుందని చెప్పారు.

ఈ స్మార్ట్‌ఫోన్ల ద్వారా VOAs తమ SHG సభ్యుల డేటా, రుణాలు, సంక్షేమ పథకాల వివరాలను రియల్ టైమ్‌లో నిర్వహించగలరని, ఇప్పటివరకు ఉన్న మాన్యువల్ విధానాన్ని తొలగించి పారదర్శకత మరియు వేగాన్ని పెంచుతుందని తెలిపారు. మహిళల ఆధ్వర్యంలోని సంఘ వ్యవస్థలను బలోపేతం చేయడం, గ్రామీణ స్థాయి సిబ్బందికి మెరుగైన పనివాతావరణం కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మూడు మండలాల APOలు మరియు సిబ్బంది, ఏఎంసీ చైర్మన్, టీడీపీ నాయకులు, గ్రామ సంఘ సహాయకులు (VOAs) మరియు స్వయం సహాయక సంఘ మహిళలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పేదలకు ఆసరా ఉండేలా సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు
* పేదలకు ఆసరా ఉండాలనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. * ప్రతీ నెలా 1 తేదీనే ఎన్టీఆర్ భరోసా...
By Rajini Kumari 2026-02-28 12:51:53 0 201
Telangana
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక
తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక జరగబోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఈ...
By Bharat Aawaz 2025-10-15 08:26:20 0 885
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : కారు ఢీకొని వ్యక్తి పరిస్థితి విషమం
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటుక బట్టీలో...
By Kothuru Murali 2026-04-10 04:54:50 0 69
Andhra Pradesh
మాజీ సీఎం పాదయాత్ర పై బుద్దా వెంకన్న ప్రెస్ మీట్
*మీడియా మిత్రుల‌కు ఆహ్వానం* *22-01-2026*   *విలేఖ‌రుల స‌మావేశం*  ...
By Rajini Kumari 2026-01-22 12:38:02 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com