వివాహిత అనుమానాస్పద మృతి

0
114

భారత్ ఆవాజ్ 

సూర్యమోహన్ మద్దూర్ మండల రిపోర్టర్ 

 

 

వివాహిత అనుమానాస్పద మృతి

 

 

నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట తండాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఎర్రగుంట తండాకు చెందిన కవిత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.కవిత మరణం వెనుక తన భర్త వశ్యనాయక్ హస్తం ఉందని ఆయనే తమ కుమార్తెను హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అయితే తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుండి తరలించడానికి వీల్లేదంటూ మృతురాలి బంధువులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.పోలీసులను అడ్డుకుంటూ ఘటన స్థలంలోనే బైఠాయించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.పోలీసులు మృతురాలి బంధువులకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కవిత మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరులో యాచకుడి మృతి
పుంగనూరు పట్టణంలో రోడ్లపై యాచించుకుంటూ జీవనం సాగిస్తున్న దిలావర్ (65) నాగపాళ్యంలో ఒక షాపు వద్ద...
By Kothuru Murali 2026-02-03 09:30:07 0 136
Andhra Pradesh
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో భద్రతా మరియు బందోబస్తు నిర్వహణపై గౌరవ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులతో కలసి హాజరైన జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.
🚩 నేటి నుంచి (11.02.2026) ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా, సమావేశాలు సజావుగా...
By John Baji 2026-02-11 05:54:56 0 290
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com