కేసీఆర్‌ను దగ్గర నుంచి చూస్తే కథేమిటో అర్థమవుతుంది: టీ పీసీసీ చీఫ్

0
107

హైదరాబాద్: కేసీఆర్ అనే పులి ఫాం హౌస్‌కే పరిమితమైందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. 

‎పులి తిన్న ఆవుల గురించి బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు. 

‎పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విలేకర్లతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను దగ్గర నుంచి చూస్తేనే జీవన్ రెడ్డికి ఆయన కథేమిటనేది అర్థమవుతుందన్నారు. 

‎జీవన్ రెడ్డి చేస్తున్న విమర్శలు ఆయన ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసినప్పుడు కనిపించ లేదా? అని ఆయన్ని సూటిగా ప్రశ్నించారు. 

‎‎సీఎం రేవంత్ రెడ్డి సభకు పోటీగా కేసీఆర్ సభ పెట్టారని ఆరోపించారు. 

‎రేవంత్ సభ 20 రోజుల ముందే ఫిక్స్ అయిందని గుర్తు చేశారు.

‎కేసీఆర్‌కి మాది కౌంటర్ ప్రోగ్రాం కాదని కుండబద్దలు కొట్టారు. 

‎ఆశల పల్లకిలో ఊరేగించడం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కి అలవాటేనంటూ వ్యంగ్యంగా అన్నారు. 

‎జీవన్ రెడ్డికి కేసీఆర్ ఏం ఆశలు చూపించారో అంటూ ఎద్దేవా చేశారు.

‎మేడిగడ్డలో కేసీఆర్ చేసిన మోసాలపై జీవన్ రెడ్డే తమకు పాఠాలు చెప్పారని ఈ సందర్భంగా టీ పీసీసీ చీఫ్ గుర్తు చేసుకున్నారు. 

‎అలాంటి జీవన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి కోరస్ ఇస్తున్నాడని విమర్శించారు. 

‎గతంలో కేకే, డీఎస్ లాగే జీవన్ రెడ్డి కూడా బాధపడుతారని చెప్పారు. 

‎రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు కోరుకున్నారని స్పష్టం చేశారు. 

‎రేవంత్ పోవాలి మార్పు రావాలి అనే హక్కు ఎక్కడిది? 

‎జీవన్ రెడ్డికి అంటూ ఆయనపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అక్రమ లేఅవుట్‌పై చర్యలు: కొనుగోలుదారులు జాగ్రత్త.
మదనపల్లె మండలం రామాచర్లపల్లెలో అనుమతులు లేకుండా సుమారు 2.85 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు...
By Pagadala Venkateswar 2026-04-09 04:36:24 0 135
Maharashtra
Maharashtra Strengthens Environment and Forest Conservation
Maharashtra is reinforcing its commitment to environmental sustainability and forest conservation...
By Fathima Safa 2026-06-30 09:12:00 0 63
Andhra Pradesh
పొట్టి శ్రీరాములకు బేబినాయన నివాళి
అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఎమ్మెల్యే బేబినాయన ఘనంగా నివాళులర్పించారు. బొబ్బిలి ఎంపీడీవో...
By Boiena Rajesh 2026-03-16 14:27:34 0 186
Andhra Pradesh
ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయరాదు: జిల్లా ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను చట్టపరిధిలో తక్షణమే పరిష్కరించి న్యాయం...
By Pagadala Venkateswar 2026-03-16 10:06:23 0 159
Andhra Pradesh
గ్రీవెన్స్ కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే::
కర్నూలు:  గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి నేరుగా వినతులను స్వీకరించి...
By Hari Krishna 2025-12-26 16:18:38 0 217
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com