ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై దాడి యత్నం దుర్మార్గం సుగవాసి ప్రసాద్ బాబు

0
32

హైదరాబాదులోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం పై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించడం తీవ్రంగా ఖండిస్తున్నామని రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు టిటిడి మాజీ పాలకమండలి సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా రాయచోటి పట్టణం గాలివీడు రోడ్డులోని టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను మీడియా ప్రశ్నిస్తే దాడులకు దిగడం వైసిపి రాక్షస స్వభావాన్ని బయటపెడుతుందని మండిపడ్డారు అమరావతి రాజధాని విషయంలో వైసీపీ ప్రజలను మోసం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి నుంచి వెనక్కి నెట్టారని ఈ అంశంపై మీడియా నిజాలు బయట పెడితే వైసీపీ నేతలు జీర్ణించుకోలేక దౌర్జన్యానికి దిగుతున్నారని తెలిపారు ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభం అని దాని గొంతు నొక్కి ప్రయత్నం చేయడం ప్రారంభించారు వైసీపీకి ఉన్న రౌడీ సంస్కృతి ఈ ఘటనతో మరోసారి బట్టబయలైందని తన సొంత మీడియా ద్వారా ఇతరులపై ఆరోపణలు చేస్తూ తమ తప్పులను ఎత్తి చూపిన వారిపై దాడులకు దిగడం దుర్మార్గమని పేర్కొన్నారు ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తప్పు చేసిన వారు చట్టం నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని హెచ్చరించారు 

Search
Categories
Read More
Andhra Pradesh
తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో డా. ఉండవల్లి శ్రీదేవి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.
తాడేపల్లి హెచ్ఎఫ్ కన్వెన్షన్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్...
By John Baji 2026-02-04 15:02:53 0 187
Telangana
ఫ్యూచర్ సిటీని ప్రత్యేక కమిషనరేట్ గా మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.|
   హైదరాబాద్ :  రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజిగిరి కమిషనరేట్‌గా మార్పు,...
By Sidhu Maroju 2025-12-29 18:05:02 0 125
Media Academy
The Noble Profession Of Journalism: A Career For The Curious And Committed
The Noble Profession Of Journalism: A Career For The Curious And Committed Becoming A Journalist...
By Media Academy 2025-04-28 19:08:32 0 3K
Andhra Pradesh
పెంచికలపాడు విశ్వ భారతి హాస్పిటల్ నందు వైద్యం వికటించి బాలింత మృతి
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా బాలింత మృతి అంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ బాలింత మృతి పై ఆందోళనకు దిగిన...
By mahaboob basha 2025-12-05 15:24:29 0 414
Himachal Pradesh
Pong Dam Crosses Danger Level After Heavy Rain |
The water level at Pong Dam rose by nearly 2 feet following heavy rains, crossing the danger...
By Pooja Patil 2025-09-16 08:40:17 0 561
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com