వారపు సంత వేలం రికార్డు

0
88

చింతూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ వారపు సంత వేలంపాట శనివారం ఉత్సాహంగా జరిగింది. పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో చింతూరుకు చెందిన గిరిజన మహిళ శ్యామల లలిత అత్యధికంగా 6 లక్షల 65 వేల రూపాయలకు సంతను దక్కించుకున్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం వేలం ప్రక్రియను పారదర్శకగా నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మరియు ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న చింతూరు సంతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మూడు రాష్ట్రాల గిరిజన ప్రజలు తమకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరగాయలు మరియు ఇతర సరుకులను తక్కువ ధరకే ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. గిరిజన ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఈ సంత వేలంలో గిరిజన మహిళే ముందంజలో నిలిచి దక్కించుకోవడం విశేషం.

Search
Categories
Read More
Andhra Pradesh
టీడీపీ కార్యాలయంలో “మహిళా గ్రీవెన్స్” కార్యక్రమాన్ని నిర్వహించిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే.
గుంటూరు పశ్చిమలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ వ్యక్తిగత, కుటుంబ,...
By John Baji 2026-01-06 12:35:52 0 126
Andhra Pradesh
అర్హత కలిగిన పేద విద్యార్థుల విద్య
శ్రీకాకుళం: ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు...
By Manda Ramkumar 2026-03-27 04:45:43 0 106
Andhra Pradesh
గుంటూరు జిల్లా ఎస్పీ వాకుల్ జిందల్ వి వి ఐ పి బందొబస్తూ ఏర్పాట్లు.
 గుంటూరు జిల్లా పోలీస్...* *తేది : 24.12.2025* _*//వీవీఐపీ బందోబస్తు ఏర్పాట్లపై...
By KOTESWARARAO KVSR 2025-12-24 13:35:14 0 208
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com