పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటిన డిప్యూటీ సీ.ఎం. బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీ గణేష్

0
839

మల్కాజ్ గిరి/ బోయిన్ పల్లి  

బోయిన్ పల్లి లోని NIEPID (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్ మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చ్వల్ డిసేబిలిటీస్)లో ఇస్మాయిలీ కమ్యూనిటీ ఆధ్వర్యంలోని అగాఖాన్ సోషల్ వెల్ఫేర్ బోర్డు వారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం లో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని అగా ఖాన్ సోషల్ వెల్ఫేర్ బోర్డు వారు నిపిడ్ (NIEPID) వారితో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ స్వచ్ఛంద సంస్థ వారు చేపట్టడం అభినందనీయమని, దివ్యాంగులు విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న ఈ సంస్థలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని, తాను కూడా సొంతంగా మరియు ప్రభుత్వం ద్వారా అవసరమైన సహాయ సహకారాలు అందించి దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

    -సిద్దుమారోజు 

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాదాలు మరియు మాదకద్రవ్యాలు నివారణ పట్ల ప్రత్యేక దృష్టి గుంటూరు రేంజ్ ఐజి శ్రీ సర్వ శ్రేష్ట త్రిపాటి మరియు గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపిఎస్
గుంటూరు జిల్లా పోలీస్...తేది: 23.12.2025* _రోడ్డు ప్రమాదాలు మరియు మాదక ద్రవ్యాల నివారణ పట్ల...
By KOTESWARARAO KVSR 2025-12-23 13:30:48 0 175
Telangana
వెయ్యి కోట్ల సైబర్ స్కాం.. సంక్రాంతి రోజున బయటపడిన భారీ మోసం
వెయ్యి కోట్ల సైబర్ స్కాం.. సంక్రాంతి రోజున బయటపడిన భారీ మోసం సంక్రాంతి పండుగ వేళ సుమారు వెయ్యి...
By Pinnehasan Odela 2026-01-15 14:31:53 0 404
Telangana
ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి ఎంపీ ఆగ్రహం
ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి ఎంపీ Vamsi Gaddam గారి ఆగ్రహం...
By Ponnala Srinivasrao 2026-05-16 02:51:52 0 73
Andhra Pradesh
LV Subrahmanyam: తిరుమల లడ్డూ కల్తీపై ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు.
    LV Subrahmanyam: తిరుమల లడ్డూ కల్తీపై ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు...
By Pagadala Venkateswar 2026-02-07 07:54:31 0 134
Andhra Pradesh
లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలన దేవాదాయ శాఖ కమిషనర్
*సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలి*   *-దేవాదాయ శాఖ కమిషనర్...
By Rajini Kumari 2025-12-23 07:51:29 0 257
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com