వారపు సంత వేలం రికార్డు

0
282

చింతూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రసిద్ధ వారపు సంత వేలంపాట శనివారం ఉత్సాహంగా జరిగింది. పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో చింతూరుకు చెందిన గిరిజన మహిళ శ్యామల లలిత అత్యధికంగా 6 లక్షల 65 వేల రూపాయలకు సంతను దక్కించుకున్నారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం వేలం ప్రక్రియను పారదర్శకగా నిర్వహించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మరియు ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న చింతూరు సంతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మూడు రాష్ట్రాల గిరిజన ప్రజలు తమకు కావలసిన నిత్యావసర వస్తువులు, కూరగాయలు మరియు ఇతర సరుకులను తక్కువ ధరకే ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. గిరిజన ప్రాంతాల ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఈ సంత వేలంలో గిరిజన మహిళే ముందంజలో నిలిచి దక్కించుకోవడం విశేషం.

Search
Categories
Read More
Andhra Pradesh
స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం. మేకింగ్ ఇండియాకి మద్దతు ఇద్దాం
పత్రికా ప్రకటన విజయవాడ    *• స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం మేకిన్ ఇండియాకి...
By Rajini Kumari 2026-01-04 11:08:14 0 193
Telangana
హవాలా డబ్బు వివరాలు వెల్లడించిన NZ. DCP రష్మీ పెరుమాళ్.|
      సికింద్రాబాద్  : గతేడాది బోయిన్ పల్లి పీఎస్ లో చీటింగ్ కేసు...
By Sidhu Maroju 2025-12-05 13:31:32 0 299
SURAKSHA
Dr. Jyothi Buddha Prakash IAS: Leading with Vision
A distinguished Telangana IAS officer transforming public administration through visionary...
By Lokeshwari Panthadi 2026-07-15 06:07:53 0 123
Andhra Pradesh
పెంచిన బడ్జెట్ కేటాయింపుల్లో రైల్వే శాఖకు అభివృద్ధి ప్రోత్సాహం
SCR BZA PR No.296 తేదీ: 07 ఫిబ్రవరి , 2026   *పెంచిన బడ్జెట్ కేటాయింపులతో ఆంధ్రప్రదేశ్...
By Rajini Kumari 2026-02-07 12:01:57 0 176
Bharat Aawaz
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివోజింగ్ ప్రక్రియ
*ఈ రోజు అనగా (09-07-2026) గురువారం   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న *"SIR" (Special...
By Benguluri Madhubabu 2026-07-09 12:28:09 0 96
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com