మాలినేని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 'సంస్కృతి-2026' వైభవం * ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ఎన్.సి.సి విద్యార్థుల ఘనస్వాగతం

0
867

మాలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 'సంస్కృతి 2026' వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు కళాశాల ఎన్.సి.సి విద్యార్థినులు 'గార్డ్ ఆఫ్ ఆనర్'తో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు నాయకత్వ లక్షణాలను, క్రమశిక్షణను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారతకు సాంకేతిక విద్యే మూలమని ఆయన పేర్కొన్నారు.

కళాశాల ప్రాంగణం విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలతో సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మాలినేని లక్ష్మయ్య, ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో భవన నిర్మాణ కార్మికులకు గుడ్‌న్యూస్.. పథకాలు పునరుద్ధరణ.
కార్మికులు, యాజమాన్యం రెండు కళ్లలా చూస్తామన్న మంత్రి సుభాష్ భవన నిర్మాణ కార్మికులకు నిలిచిన...
By Pagadala Venkateswar 2026-05-21 07:09:48 0 38
Jammu & Kashmir
Apple Orchards in Ruins: Hailstorms Decimate Kashmir’s Fruit Economy
A catastrophic wave of unseasonal rain and severe hailstorms has ravaged the horticulture...
By Dunna Jessicaruth 2026-05-14 07:41:12 0 41
Andhra Pradesh
Ambati Rambabu: జైలులో అంబటి నిద్రకు ప్రత్యేక పరికరం.
నిద్రలో శ్వాస సంబంధిత సమస్య ఉన్న అంబటి రాంబాబు కోర్టు ఆదేశాలతో స్లీప్ అప్నియా పరికరాన్ని...
By Pagadala Venkateswar 2026-02-04 07:39:22 0 125
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com