వేటపాలెం మండలంలో రేషన్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు...

0
141

చీరాల: వేటపాలెం మండల పరిధిలోని రేషన్ దుకాణాలపై బుధవారం రెవెన్యూ డివిజనల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది రేషన్ దుకాణాలను పరిశీలించగా, ఆరు దుకాణాల్లో నిర్దేశిత పరిమితిని మించిన నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.
నిబంధనలకు విరుద్ధంగా అదనపు స్టాక్ నిల్వ ఉంచిన ఆరు దుకాణాలపై కేసులు నమోదు చేసి, సంబంధిత దుకాణాలను సీజ్ చేశారు. ప్రజలకు సరఫరా చేయాల్సిన నిత్యావసర వస్తువుల విషయంలో ఎలాంటి అక్రమాలు సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.
ఈ తనిఖీలలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, వేటపాలెం తహసీల్దార్ గీతారాణి, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. చీరాల మండల గ్రామ రెవెన్యూ అధికారులు కూడా తనిఖీలకు సహకరించారు.
ప్రజల హక్కులను పరిరక్షించేందుకు అధికారులు చేపట్టిన ఈ చర్యలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
మైనంపల్లి హనుమంతరావు అన్న సహకారంతో రోడ్డు పనులు ప్రారంభం
ఈరోజు అనగా 11-06-2025, బుధవారం రోజున, మౌలాలి డివిజన్ లోని గ్రీన్ హిల్స్ కాలనీ లో రోడ్ పనులు...
By Vadla Egonda 2025-06-11 11:45:23 0 2K
Andhra Pradesh
చిత్తూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన రవాణా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు చిత్తూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-02-22 09:46:05 0 138
Andhra Pradesh
క్రిస్మస్ సందర్భంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్
25.12.2025.   క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా, మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ...
By Rajini Kumari 2025-12-25 10:41:49 0 219
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com