‎ ‎ ‎‎*BRS పార్టీ పోరాట ఫలితమే *నేడు రుద్రంగి గ్రామానికి* *ఎల్లంపల్లి నీళ్లు*

0
218

గత కొద్ది రోజులుగా రుద్రంగి గ్రామంలో నీళ్లు లేక రైతుల పంట పొలాలు ఎండిపోవడం జరిగింది.మరికొద్ది మంది రైతులు పొట్ట దశలో ఉన్న పంటను కాపాడుకోవడానికి ట్యాంకార్లతో నీళ్లు కొనుక్కొని తెచ్చుకొని పంటలను కాపాడుకున్న సందర్భం మనం చూసినం,రైతులు ఆరుగలం కష్టం చేసి పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోతే ఆ రైతు బాధ అంత ఇంత కాదు,అదే విధంగా చెరువుల నీళ్లు లేక గంగపుత్రుల జీవనదారం అయిన చేపలు కూడా చనిపోయి వారి ఉపాధి పోయి వాళ్ళ బ్రతుకులు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.

‎అందుకే వారి పక్షాన రైతుల పక్షపాతి BRS పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది, ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలు రుద్రంగి గ్రామానికి ఫిబ్రవరి లోనే నీళ్లు వస్తాయని, గత ప్రభుత్వం ధర్నాలు, రాస్తారోకలు చేస్తే తప్ప రైతులకు నీళ్లు ఇవ్వలేదు, మేము అలా కాదు అవి ఏవి చేయకముందే నీళ్లు ఇస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు మన గ్రామానికి వచ్చిన చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది కానీ నీళ్లు మాత్రం ఇవ్వలేదు.ఎండిన పంటలు పశువుల పాలయ్యాయి, ఈ ప్రభుత్వం ఆరు గ్యారంటీలా పేరుతొ రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా, ఎరువులు సమయానికి ఇవ్వకుండా, కూలి రైతులకు12 వేలు ఇవ్వకుండా వడ్లకు బోనస్ ఇవ్వకుండా,కౌలు రైతులను,రైతులను ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం,ఇప్పుడు 2 రెండు సంవత్సరాలు గడిచిన మాయమాటలతో కాలయాపన చేస్తుంది, మీ హామీలన్నీ అమలు అయ్యేంతవరకు  BRS పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాటం చేస్తాము, మా BRS పార్టీ ప్రభుత్వ హయాంలోనే కెసిఆర్ గారి నాయకత్వంలో ఎత్తిపోతల పతకం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఎల్లంపల్లి నీళ్లను కాలువల ద్వారా, మోటార్ పంపుల ద్వారా రుద్రంగి గ్రామానికి కాళేశ్వరం ఎల్లంపల్లి నీళ్లను తెచ్చి రుద్రంగి బీడు భూములను తడిపి పచ్చని పంటపోలలుగా మార్చిన ఘనత BRS పార్టీ గౌరవ కెసిఆర్ గారికే దక్కుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యమానేరు ప్రాజెక్టు కు 2004 లో శంకుస్థాపన చేసి తట్టేడు మట్టి కూడా తియ్యలేదు....

‎ముమ్మాటికీ BRS పార్టీ కృషి పోరాట ఫలితమే-నేడు రుద్రంగికి కాళేశ్వరం ఎల్లంపల్లి నీళ్లు రావడం జరిగింది..

‎ఈ నీళ్లు ఎన్ని రోజులు ఇస్తారో చూడాలి??

Search
Categories
Read More
Andhra Pradesh
సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం
సహజ ప్రసవం ద్వారా 4.8 కేజీల శిశువు జననం!   -అనకాపల్లి జిల్లా ఆసుపత్రి వైద్య బృందం ఘనత - 4...
By Rajini Kumari 2025-12-31 09:53:49 0 161
Telangana
భారతీయ జనతా పార్టీ ఓబిసి మోర్చా ధర్నా.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్గిరి జిల్లా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు...
By Sidhu Maroju 2025-11-29 10:26:39 0 172
Andhra Pradesh
కారుతో బీభత్సం సృష్టించిన విద్యార్థి.
కురబలకోట రైల్వే ఫ్లైఓవర్‌పై బుధవారం ఒక విద్యార్థి అతివేగంగా కారు నడపడంతో అది అదుపుతప్పి...
By Pagadala Venkateswar 2026-03-04 11:39:37 0 111
Media Academy
Why Journalism Is The Most Important Career Today: Shaping The Future Of Society
Why Journalism Is The Most Important Career Today: Shaping The Future Of Society In...
By Media Academy 2025-04-28 18:13:59 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com