వేటపాలెం మండలంలో రేషన్ దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు...

0
229

చీరాల: వేటపాలెం మండల పరిధిలోని రేషన్ దుకాణాలపై బుధవారం రెవెన్యూ డివిజనల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది రేషన్ దుకాణాలను పరిశీలించగా, ఆరు దుకాణాల్లో నిర్దేశిత పరిమితిని మించిన నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.
నిబంధనలకు విరుద్ధంగా అదనపు స్టాక్ నిల్వ ఉంచిన ఆరు దుకాణాలపై కేసులు నమోదు చేసి, సంబంధిత దుకాణాలను సీజ్ చేశారు. ప్రజలకు సరఫరా చేయాల్సిన నిత్యావసర వస్తువుల విషయంలో ఎలాంటి అక్రమాలు సహించబోమని అధికారులు స్పష్టం చేశారు.
ఈ తనిఖీలలో ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు, వేటపాలెం తహసీల్దార్ గీతారాణి, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. చీరాల మండల గ్రామ రెవెన్యూ అధికారులు కూడా తనిఖీలకు సహకరించారు.
ప్రజల హక్కులను పరిరక్షించేందుకు అధికారులు చేపట్టిన ఈ చర్యలపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Madhya Pradesh
MP Monsoon Alert: Agriculture and Disaster Teams Ready
With the Southwest Monsoon now actively covering parts of Madhya Pradesh, the state government...
By Lokeshwari Panthadi 2026-06-27 08:05:47 0 50
Telangana
మంచిర్యాల: అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని స్టేషన్ రోడ్ లో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని కలెక్టర్...
By Bonagiri RaviShankar 2026-06-12 05:29:55 0 198
Andhra Pradesh
మదనపల్లెలో టిప్పర్ ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి.
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో సోమవారం సీటీఎం రోడ్డు దేవతానగర్ వద్ద గుర్తుతెలియని మహిళను...
By Pagadala Venkateswar 2026-01-26 11:56:11 0 182
Andhra Pradesh
అమరావతిలో అటల్ బిహారీ వాజ్‌పేయి కాంస్య విగ్రహావిష్కరణకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గము నుండి ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో భారీగా తరలివెళ్లిన ఎన్డీయే కూటమి నేతలు ప్రజలు
భారత మాజీ ప్రధాని, అజాత శత్రువుగా దేశ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిన అటల్ బిహారీ వాజ్‌పేయి...
By John Baji 2025-12-25 14:04:57 0 221
International
Breaking News from Iran
ఇరాన్‌ మీడియా సంచలన ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎఫ్-15ఈ యుద్ధ...
By Terli Ashok 2026-04-03 17:40:30 0 614
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com