సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు.. అభినందించిన పవన్ కల్యాణ్.

0
101

సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025' అవార్డు

ప్రముఖ ఆర్థిక పత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించిన పురస్కారం

ముంబైలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ప్రధానం

ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఆర్థిక దినపత్రిక 'ది ఎకనామిక్ టైమ్స్' ఆయనను 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ - 2025' అవార్డుతో సత్కరించింది. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నిన్న జరిగిన 26వ ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు.

 

పరిపాలనలో చేపట్టిన సంస్కరణలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంలో చేసిన కృషికి గాను చంద్రబాబుకు ఈ గౌరవం దక్కింది. ముఖ్యంగా 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్', 'స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్' వంటి విధానాలను అమలు చేయడం, స్వల్పకాలంలోనే రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి హామీలను ఆకర్షించడంలో చూపిన చొరవను ఎకనామిక్ టైమ్స్ జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది.

 

ఈ పురస్కారంపై ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. "చంద్రబాబు నాయకత్వ శైలి ఎంతో స్ఫూర్తినిస్తుంది. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన అమలు చేస్తున్న పాలనా విధానాలు, పారిశ్రామికవృద్ధికి చేపడుతున్న సంస్కరణలు కచ్చితంగా సత్ఫలితాలనిస్తాయి. ఆయనకు దక్కిన ఈ అవార్డు రాష్ట్రమంతటికీ గర్వ కారణంగా భావిస్తున్నాను," అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
ఈరోజు రాయచోటి పట్టణంలో పలుచోట్ల ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు ...
By Benguluri Madhubabu 2026-01-18 07:17:01 0 406
Andhra Pradesh
తిరుమల లడ్డూకు పెరిగిన డిమాండ్.. విక్రయాల్లో సరికొత్త రికార్డు!
తిరుమల శ్రీవారి దర్శనం ఎంత ప్రత్యేకమో, స్వామివారి ప్రసాదమైన లడ్డూ కూడా అంతే ప్రత్యేకం. తాజాగా ఈ...
By Pagadala Venkateswar 2026-04-11 06:50:34 0 105
Andhra Pradesh
రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు విజయవాడలో రాష్ట్ర సచివాలయంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే...
By Benguluri Madhubabu 2026-01-28 07:35:56 0 260
Andhra Pradesh
లారీ ఢీకొని ఇద్దరు బాలురు మృతి.
అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం చీకుల బైలు వద్ద లారీ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-03-21 06:02:57 0 166
Puducherry
Puducherry Strengthens Sports Infrastructure and Youth
Puducherry is enhancing sports infrastructure and youth development through investments in modern...
By Fathima Safa 2026-06-29 09:01:35 0 50
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com