మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ

0
1K

వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీపీఐ కాకినాడ జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, కమిటీ సభ్యుడు దువ్వా శేషబాబు శనివారం సంతాపం తెలిపారు.

బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన వారు, ఈ ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం ప్రకటించి చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా నిలవాలని సీపీఐ నాయకులు విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
International
U.S. Wields Oil Sanctions Weapon Against Iran Again
ఇరాన్‌పై మళ్లీ అమెరికా చమురు ఆంక్షల అస్త్రం   వాషింగ్టన్‌: ఇరాన్‌పై అమెరికా...
By G k Nookala 2026-07-08 05:26:59 2 573
Andhra Pradesh
కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రంగ వర్ధంతి కార్యక్రమం
*వీ ఎం రంగా ఆశయాల సాధన కోసం కృషి చేస్తాం*   *కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా రంగా వర్ధంతి...
By Rajini Kumari 2025-12-26 09:58:08 0 208
Telangana
ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి.
Alert… ఈ దొంగలను చూస్తే వెంటనే తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ ఫోటోలలో ఉన్న దొంగలు...
By Ponnala Srinivasrao 2026-05-03 16:53:32 0 112
Telangana
కరీంనగర్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
కరీంనగర్ కమిషనర్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మొమ్మద్ అబ్దుల్ వాజిద్ గత పదివేలుగా...
By Sunka Santhosh 2026-06-01 17:47:23 0 102
Andhra Pradesh
Pawan Kalyan: మోదీ, అశ్విని వైష్ణవ్, చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ చేసిన కృషి ఫలించింది. చారిత్రక,...
By Pagadala Venkateswar 2026-04-07 04:18:40 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com