మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి: సీపీఐ

0
448

వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం పట్ల సీపీఐ కాకినాడ జిల్లా కమిటీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, కమిటీ సభ్యుడు దువ్వా శేషబాబు శనివారం సంతాపం తెలిపారు.

బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించిన వారు, ఈ ఘటన రాష్ట్రాన్ని కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఒక్కొక్కరికి రూ.50 లక్షల నష్టపరిహారం ప్రకటించి చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదకర పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అన్ని విధాల అండగా నిలవాలని సీపీఐ నాయకులు విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
సిఫార్సులకే పెద్దపీట తాగిందుకు మంచినీళ్లు లేవు
*క్యూలైన్లో భక్తుల కష్టాలు.*   *త్రాగేందుకు నీళ్లు లేక భక్తుల అవస్థలు*  ...
By Rajini Kumari 2025-12-30 12:30:50 0 131
Telangana
అల్వాల్ పీఎస్ పరిధిలో హత్య కలకలం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పి.ఎస్. ఎస్ హెచ్ ఓ  ప్రశాంత్ తెలిపిన వివరాల...
By Sidhu Maroju 2026-01-04 14:37:16 0 129
Andhra Pradesh
నరసరావుపేట–గుంటూరు రహదారిపై విషాదం
నరసరావుపేట–గుంటూరు రహదారిపై విషాదం ఇన్నోవా క్రిష్టా ఢీకొని ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్...
By Gadiyapudi Narendra 2025-12-30 10:50:06 0 177
Andhra Pradesh
ఆరేళ్ల కష్టం.. అరవై ఏళ్ల సుఖం: కలెక్టర్ నిశాంత్ కుమార్.
మదనపల్లిలో జరిగిన మహిళా చైతన్య సదస్సులో కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు....
By Pagadala Venkateswar 2026-03-07 04:49:13 0 74
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com