నేడే ఫిబ్రవరి 21 రైతు ఉత్సవం

0
124

*ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌*

*ఎన్‌టీఆర్ జిల్లా, ఫిబ్ర‌వ‌రి 20, 2026*

 

*నేడే (ఫిబ్ర‌వ‌రి 21) భారీస్థాయిలో ఆర్గానిక్ రైతోత్స‌వం*

- *అన్న‌దాత‌లు, ఔత్సాహికులు స‌ద్వినియోగం చేసుకోండి*

- *కార్య‌క్ర‌మం విజ‌య‌వంతానికి స‌మ‌ష్టిగా కృషిచేద్దాం*

- *జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌*

 

ఈ నెల 21వ తేదీ శ‌నివారం ఎ.కొండూరు మండ‌లం, కృష్ణారావుపాలెంలో భారీస్థాయిలో ఎన్‌టీఆర్ జిల్లా సేంద్రియ మేళా-ఆర్గానిక్ రైతోత్స‌వం జ‌ర‌గ‌నుంద‌ని.. అన్న‌దాత‌లు, ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఔత్సాహికులు పెద్దఎత్తున పాల్గొని, కార్య‌క్ర‌మాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ కోరారు.

ఈ నెల 21న కృష్ణారావుపాలెం, 22వ తేదీన విజ‌య‌వాడ‌లో ఎన్‌టీఆర్ ఆర్గానిక్ రైతోత్స‌వం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో వీటికి చేస్తున్న ఏర్పాట్ల‌పై క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ శుక్ర‌వారం.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌తో క‌లిసి రెవెన్యూ, ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, ఉద్యాన‌, ప‌శుసంవ‌ర్థ‌క త‌దిత‌ర స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల‌తో వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ సేంద్రియ వ్య‌వ‌సాయంపై విస్తృత అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతో పాటు రైతుల‌కు సామ‌ర్థ్య అభివృద్ధి, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు ఉంటాయ‌ని వివ‌రించారు. ఈ మేళాలో సేంద్రియ ఉత్ప‌త్తుల ప్ర‌ద‌ర్శ‌న‌, విక్ర‌య స్టాళ్లు కూడా ఉంటాయ‌ని, సేంద్రియ సాగుకు అవ‌స‌ర‌మైన ఉత్పాదితాల ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంద‌న్నారు. రైతు–నిపుణుల పరస్పర చర్చా వేదికల ద్వారా సందేహాల నివృత్తితో పాటు మేధోమ‌థ‌నానికి అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు వివ‌రించారు. ఇదేవిధంగా ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతులు, వినియోగ‌దారులు, సంస్థ‌ల‌ను ఒకే వేదిక‌పైకి తీసుకొచ్చే ల‌క్ష్యంతో ఈ నెల 22వ తేదీన విజ‌య‌వాడ ఇందిరాగాంధీ మునిసిప‌ల్ మైదానంలోనూ ప్ర‌కృతి వ్య‌వ‌సాయ మేళాను నిర్వ‌హించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు. రైతులు పండించిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధ‌ర ల‌భించేలా మార్కెటింగ్ లింకేజీలు ఏర్పాటు చేయ‌డంతో పాటు ఎంవోయూలపై అవ‌గాహ‌న‌తో పాటు అవ‌కాశాలు క‌ల్పించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతంగా నిర్వ‌హించి, మంచి ఫ‌లితాలు వ‌చ్చేలా అధికారులు స‌మ‌న్వ‌యంతో కృషిచేయాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించార

Search
Categories
Read More
Andhra Pradesh
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం కమీటీ...
By Rajini Kumari 2026-05-07 08:16:30 0 72
Telangana
జిహెచ్ఎంసి డిసి కి వినతి పత్రం అందజేసిన కార్పొరేటర్. |
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి అల్వాల్ జిహెచ్ఎంసి నూతన DC...
By Sidhu Maroju 2025-12-29 12:22:30 0 147
Karnataka
ಧಾರವಾಡದಲ್ಲಿ ೩೫ನೇ ಕೃಷಿ ಮೇಳ ಮಣ್ಣಿನ ಆರೋಗ್ಯ, ಪಾರಂಪರಿಕ ಬೀಜಗಳಿಗೆ ಒತ್ತು
ಧಾರವಾಡದ ಕೃಷಿ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದ ಆವರಣದಲ್ಲಿ ೩೫ನೇ #ಕೃಷಿಮೇಳ ಭರ್ಜರಿಯಾಗಿ ಆರಂಭವಾಗಲಿದೆ. ಈ ಬಾರಿ...
By Pooja Patil 2025-09-13 05:43:48 0 202
Andhra Pradesh
ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
  ఇకపై 24 గంటల్లోనే వాహన రిజిస్ట్రేషన్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు Andhra Chandrababu...
By Pagadala Venkateswar 2026-05-05 06:37:59 0 79
Telangana
కిష్టమ్మ ఎన్క్లేవ్ సమస్యల పరిష్కారానికి మాజీ కార్పొరేటర్ హామీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కిష్టమ్మ ఎన్క్లేవ్ కాలనీ నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం మాజీ...
By Sidhu Maroju 2026-03-01 09:41:55 0 137
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com