0 Comments
0 Shares
168 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్కు తీవ్ర గాయాలుమంగళవారం రాత్రి పుంగనూరు మండలం మొరంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్ హేమంత్ (20) తీవ్రంగా గాయపడ్డాడు. విధి నిర్వహణ ముగించుకుని బైక్పై ఇంటికి వస్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన హేమంత్ను మదనపల్లి ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు రిఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు #కొత్తూరు మురళి.0 Comments 0 Shares 129 Views 0 Reviews
-
గ్యాస్ లారీ డీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలుహనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద గ్యాస్ సిలిండర్ తో వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని 108 అంబులెన్సు ద్యారా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి బీమదేవరపల్లి మండలానికి చెందినవాడని, అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానికులు తెలిపారు.0 Comments 0 Shares 457 Views 0 Reviews
-
చింతచెట్టు పైనుంచి పడి యువకుడికి తీవ్ర గాయాలు.మదనపల్లి మండలంలో మంగళవారం, గంగన్నగారిపల్లికి చెందిన రవి (38) అనే యువకుడు నిమ్మనపల్లి రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో చింతకాయలు కోసేందుకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు చింతచెట్టు పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. చెట్టుపై నుంచి కింద పడటంతో అతనికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు.0 Comments 0 Shares 123 Views 0 Reviews
-
చేపల వేటలో ప్రమాదం – వృద్ధుడికి తీవ్ర గాయాలు.మదనపల్లి మండలంలో శనివారం జరిగిన సంఘటనలో, సిటిఎం ప్రాంతానికి చెందిన ఎర్రప్ప (60) అనే వృద్ధుడు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు బండరాయిపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మల్రెడ్డి చెరువు సమీపంలో చోటుచేసుకుంది. గమనించిన పశువుల కాపరులు వెంటనే స్పందించి, అతన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.0 Comments 0 Shares 132 Views 0 Reviews
-
దేశాయిపేట వద్ద రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలుచీరాల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని దేశాయిపేటలో ఆమోదగిరి పట్నం మార్కెట్ ఎదుట సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు దాటుతున్న వ్యక్తి అకస్మాత్తుగా ముందుకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి...0 Comments 0 Shares 157 Views 0 Reviews
-
నిమ్మనపల్లె: రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.నిమ్మనపల్లె మండలం గౌనిగారిపల్లెకు చెందిన రైతు చెండ్రాయుడు (60) ఆదివారం బోయకొండ వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బోయకొండ టోల్ ప్లాజా వద్ద లారీని తప్పించబోయి అదుపుతప్పి కింద పడిపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.0 Comments 0 Shares 11 Views 0 Reviews
-
పాదాచారిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరు మృతిముగ్గురికి తీవ్ర గాయాలుపాదాచారిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు మార్కాపురం జిల్లా.... పెద్ద దోర్నాలలో గ్రామపంచాయతీ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదం అయినముక్కల గ్రామానికి చెందిన భోగ్యం మద్దయ్య నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో మద్దయ్యకు కుడి భుజం విరిగింది. పులిచెర్ల బయన్నకు తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు...0 Comments 0 Shares 186 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గం: పిచ్చికుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలుపుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో సోమవారం చెరుకువారిపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల మస్తాన్ అనే బాలుడు తన ఇంటి వద్ద కూర్చుని ఉండగా పిచ్చికుక్క దాడి చేసింది. ఈ దాడిలో బాలుడి శరీరమంతా గాయాలయ్యాయి. వైద్యుల అంచనా ప్రకారం, బాలుడు కనీసం 10 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది. గ్రామస్తులు వీధి కుక్కల బెడద అధికంగా ఉందని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు#...0 Comments 0 Shares 87 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గం:కారు - బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలుపుంగనూరు మండలం కృష్ణాపురం గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి బోయకొండకు వెళ్తున్న కారు, మదనపల్లె వైపు వస్తున్న బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న గంగిరెడ్డి, బాలకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 149 Views 0 Reviews
-
పుంగనూరు: టెంపో - బైక్ ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలుశనివారం రాత్రి పుంగనూరు మండలం ఉలవలదిన్నె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుంగనూరు నుంచి కమతంపల్లి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న టెంపో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న వెంకటరెడ్డి (45), విశ్వనాథ్ (55)లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే 108 వాహనంలో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 112 Views 0 Reviews
-
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలుపుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని చిన్న కొండా మరి సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు నాగరాజా (45) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ ప్రైవేటు బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గాయపడ్డ నాగరాజాని స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.0 Comments 0 Shares 74 Views 0 Reviews
-
లారీ ఢీకొని పోస్ట్మాస్టర్కు తీవ్ర గాయాలుసామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో గురువారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేట్లపాలెంలోని పెట్రోల్ బంకు సమీపంలో స్కూటీపై ప్రయాణిస్తున్న పోస్ట్మాస్టర్ మలకల సూర్యారావును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రజలు సూర్యారావును కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోందని...0 Comments 0 Shares 607 Views 0 Reviews
More Results