అడవి పంది ఢీకొన్న దివ్యచక్ర వాహనం ఇద్దరు కన్నడ భక్తులకు తీవ్ర గాయాలు పంది మృతి

0
161

అడవి పందిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఇద్దరు కన్నడ భక్తులకు తీవ్ర గాయాలు, పంది మృతి

మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం గంటవాని పల్లె గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అడవి పందిని ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, అడవి పంది అక్కడికక్కడే మృతి చెందింది.

ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా ఉంగరాల దిబ్బ గ్రామానికి చెందిన దూలప్ప, శంకరప్ప అనే భక్తులు శ్రీశైలం దైవ దర్శనార్థం ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్తున్నారు. ఈ క్రమంలో గంటవాని పల్లె గ్రామ సమీపానికి చేరుకోగానే అకస్మాత్తుగా అడవి పంది రోడ్డుపైకి రావడంతో వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం దానిని ఢీకొని ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో అడవి పంది అక్కడికక్కడే మృతి చెందగా, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న దూలప్ప, శంకరప్పలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని పెద్ద దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన ఇరువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కర్నూల్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కేజీబీవి లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
 చింతూరు న్యూస్ :- జిల్లా చింతూరు మండల కేంద్రంలోని కేజీబీవి పాఠశాల మరియు కళాశాల నందు 6వ...
By Shyamala Yadagiri 2026-03-14 05:26:27 0 205
Andhra Pradesh
శ్రీకాకుళం: నేడు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొండపల్లి రాక
నేడు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొండపల్లి రాక సందర్భంగా, ఎస్పీ మరియు ఇతర అధికారుల సమావేశంలో...
By Manda Ramkumar 2026-03-30 01:09:53 0 86
Telangana
మితిమీరిన పంచాయతీరాజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం.|
  హైదరాబాద్ :  ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు అంటూ మొదట మెమో విడుదల చేసిన అధికారులు....
By Sidhu Maroju 2025-12-23 13:47:13 0 198
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com