• గ్యాస్ లారీ డీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
    హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద గ్యాస్ సిలిండర్ తో వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని  108 అంబులెన్సు ద్యారా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి బీమదేవరపల్లి మండలానికి చెందినవాడని, అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానికులు తెలిపారు.
    0 Comments 0 Shares 250 Views 0 Reviews
  • పుంగనూరు నియోజకవర్గం:కారు - బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
    పుంగనూరు మండలం కృష్ణాపురం గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి బోయకొండకు వెళ్తున్న కారు, మదనపల్లె వైపు వస్తున్న బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న గంగిరెడ్డి, బాలకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు# కొత్తూరు మురళి.
    0 Comments 0 Shares 31 Views 0 Reviews
  • పుంగునూరు లో కారు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు
    అన్నమయ్య జిల్లా పుంగునూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు. చౌడేపల్లి మండలం మరి మాకులపల్లి పెద్దూరు గ్రామానికి చెందిన గంగిరెడ్డి (32), అతని స్నేహితుడు బాలకృష్ణ (40) సోమవారం సొంత పనిమీద మదనపల్లికి వచ్చారు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలోని బోయకొండ...
    0 Comments 0 Shares 29 Views 0 Reviews
  • పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన – వ్యక్తికి తీవ్ర గాయాలు
    తుని పట్టణంలోని శ్రీరామ థియేటర్ సెంటర్‌లో బుధవారం ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో వైవాహిక కలహాల నేపథ్యంలో గూడవ హన్సాత్తుగా మారిన ఘటనలో ఒక వ్యక్తి పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం. వాగ్వాదం తీవ్రంగా మారడంతో బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్న బాధితుడు తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వైద్యులు ఉన్నత ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు తెలిసింది. నిందితుడు...
    0 Comments 0 Shares 48 Views 0 Reviews
  • బి. కొత్తకోట: చెట్టుపై నుంచి పడి రైతుకు తీవ్ర గాయాలు.
    బుధవారం కొత్తకోట మండలంలో రామప్ప (55) అనే రైతు చింతచెట్టుపై నుంచి కాయలు కోస్తుండగా కాలు జారి కింద పడిపోయాడు. బయప్పగారిపల్లి పంచాయతీ పామూరోళ్లపల్లికి చెందిన ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, వైద్యుల ప్రకారం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
    0 Comments 0 Shares 35 Views 0 Reviews
  • బోయకొండలో భక్తుల ఆటో బోల్తా.. ఏడుగురికి తీవ్ర గాయాలు.
    బోయకొండ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లిన భక్తుల ఆటో శుక్రవారం సాయంత్రం కొండపై బోల్తా పడింది. తెనాలి, రేపల్లి, పల్కికోలు, పెరవలి ప్రాంతాల నుంచి కూలి పనుల కోసం కందూరుకు వచ్చిన 13 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణమవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం మదనపల్లి ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
    0 Comments 0 Shares 31 Views 0 Reviews
  • మదనపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం.. రైతు కు తీవ్ర గాయాలు.
    మదనపల్లి మండలంలో మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ములకలచెరువు మండలం బిస్సయ్యగారిపల్లికి చెందిన రైతు వెంకటరెడ్డి (46) తీవ్రంగా గాయపడ్డాడు. సీటీఎం గంగ జాతర చూసుకుని స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా, మదనపల్లి మీదుగా వెళ్తున్నప్పుడు తట్టివారిపల్లి బైపాస్ వద్ద ఖుషి డాబా సమీపంలో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    0 Comments 0 Shares 38 Views 0 Reviews
  • మదనపల్లి: మద్యం మత్తులో కారు ఢీ – యువకుడికి తీవ్ర గాయాలు.
    మదనపల్లి పట్టణంలో మంగళవారం మద్యం మత్తులో కారు నడిపిన ఇద్దరు యువకులు స్కూటర్‌ను ఢీకొని ఓ యువకుడిని తీవ్రంగా గాయపరిచారు. తాలూకా ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం, పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు తట్టివారిపల్లి జంక్షన్ వద్ద కారును నిర్లక్ష్యంగా నడిపి ఎదురుగా వస్తున్న స్కూటర్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో గాయపడిన బాధితుడిని స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు...
    0 Comments 0 Shares 35 Views 0 Reviews
  • మదనపల్లి: మిద్దెపై నుంచి పడి చేనేత కార్మికుడుకి తీవ్ర గాయాలు.
    మదనపల్లిలోని నీరుగట్టుపల్లి రామిరెడ్డి లేఔట్‌లో చేనేత కార్మికుడు పాపయ్య (49) మిద్దెపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. పాపయ్య మగ్గాలు నేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
    0 Comments 0 Shares 44 Views 0 Reviews
  • మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో భవన కార్మికునికి తీవ్ర గాయాలు.
    మదనపల్లి మండలం నిమ్మనపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన కార్మికుడు ఉదయ్ సాగర్ (27) తీవ్రంగా గాయపడ్డాడు. గుండ్ల బురుజుకు చెందిన ఉదయ్ సాగర్, మదనపల్లిలో నిర్మాణ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా వృద్ధాశ్రమం వద్ద ద్విచక్ర వాహనం ఢీకొనడంతో కాలు విరిగింది. అతన్ని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్...
    0 Comments 0 Shares 61 Views 0 Reviews
  • మదనపల్లి: స్కూటర్ ఢీకొని రైతుకు తీవ్ర గాయాలు.
    గురువారం రాత్రి మదనపల్లి మండలం చీకిల బైలులో రోడ్డు దాటుతున్న గురికాని నారాయణస్వామి (55)ని ఓ స్కూటర్ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తులు వెంటనే స్పందించి నారాయణస్వామిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని తెలిపారు.
    0 Comments 0 Shares 38 Views 0 Reviews
  • మదనపల్లి. ఆటో బోల్తా డ్రైవర్ కి తీవ్ర గాయాలు.
    మదనపల్లి మండలంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడి డ్రైవర్‌ షఫీ ఉల్లా (53)కు తీవ్ర గాయాలయ్యాయి. పుంగనూరు నుంచి సీటీఎం వైపు వెళ్తుండగా తట్టివారిపల్లి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా జిల్లా ఆసుపత్రికి తరలించగా, వైద్యుల చికిత్సతో ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు.
    0 Comments 0 Shares 45 Views 0 Reviews
  • లారీ ఢీకొని పోస్ట్‌మాస్టర్‌కు తీవ్ర గాయాలు
    సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో గురువారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేట్లపాలెంలోని పెట్రోల్ బంకు సమీపంలో స్కూటీపై ప్రయాణిస్తున్న పోస్ట్‌మాస్టర్ మలకల సూర్యారావును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రజలు సూర్యారావును కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోందని...
    0 Comments 0 Shares 44 Views 0 Reviews
More Results
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com