0 Comments
0 Shares
351 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
కురబలకోటలో కారు ఢీకొని భవన కార్మికుడికి తీవ్ర గాయాలు.కురబలకోట మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు కె. రమణ (45) తీవ్రంగా గాయపడ్డాడు. బి. కొత్తకోటకు చెందిన రమణ, ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు వెళ్తుండగా, కురబలకోట మండలం అంగళ్లు గ్రామం చేనేత నగర్ వద్ద కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి కుటుంబీకులు ఈ వివరాలు తెలిపారు.0 Comments 0 Shares 48 Views 0 Reviews
-
గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్కు తీవ్ర గాయాలుమంగళవారం రాత్రి పుంగనూరు మండలం మొరంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రైవేట్ బస్సు డ్రైవర్ హేమంత్ (20) తీవ్రంగా గాయపడ్డాడు. విధి నిర్వహణ ముగించుకుని బైక్పై ఇంటికి వస్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన హేమంత్ను మదనపల్లి ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయాకు రిఫర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు #కొత్తూరు మురళి.0 Comments 0 Shares 198 Views 0 Reviews
-
గ్యాస్ లారీ డీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలుహనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ కూడలి వద్ద గ్యాస్ సిలిండర్ తో వెళ్తున్న లారీ, ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని 108 అంబులెన్సు ద్యారా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి బీమదేవరపల్లి మండలానికి చెందినవాడని, అతని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానికులు తెలిపారు.0 Comments 0 Shares 565 Views 0 Reviews
-
చింతచెట్టు పైనుంచి పడి యువకుడికి తీవ్ర గాయాలు.మదనపల్లి మండలంలో మంగళవారం, గంగన్నగారిపల్లికి చెందిన రవి (38) అనే యువకుడు నిమ్మనపల్లి రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో చింతకాయలు కోసేందుకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు చింతచెట్టు పైనుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. చెట్టుపై నుంచి కింద పడటంతో అతనికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు.0 Comments 0 Shares 194 Views 0 Reviews
-
చేపల వేటలో ప్రమాదం – వృద్ధుడికి తీవ్ర గాయాలు.మదనపల్లి మండలంలో శనివారం జరిగిన సంఘటనలో, సిటిఎం ప్రాంతానికి చెందిన ఎర్రప్ప (60) అనే వృద్ధుడు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు బండరాయిపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మల్రెడ్డి చెరువు సమీపంలో చోటుచేసుకుంది. గమనించిన పశువుల కాపరులు వెంటనే స్పందించి, అతన్ని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.0 Comments 0 Shares 208 Views 0 Reviews
-
దేశాయిపేట వద్ద రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలుచీరాల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని దేశాయిపేటలో ఆమోదగిరి పట్నం మార్కెట్ ఎదుట సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రోడ్డు దాటుతున్న వ్యక్తి అకస్మాత్తుగా ముందుకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి...0 Comments 0 Shares 304 Views 0 Reviews
-
నిమ్మనపల్లిలో ట్రాక్టర్పై నుంచి పడి మహిళకు తీవ్ర గాయాలు.నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం ఉదయం ప్రమాదవశాత్తు ట్రాక్టర్పై నుంచి పడిపోయి ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో గౌరమ్మ(50)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు అదే గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ యజమాని కూలి పనులకు గౌరమ్మను పిలవడంతో సహచర కూలీలతో కలిసి ట్రాక్టర్లో వెళ్లింది. జాండ్రపాళెం వద్ద ట్రాక్టర్పై కూర్చుని వెళ్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర...0 Comments 0 Shares 49 Views 0 Reviews
-
నిమ్మనపల్లిలో రోడ్డు ప్రమాదం.. రైతుకు తీవ్ర గాయాలు.నిమ్మనపల్లి మండలంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగంవారిపల్లికి చెందిన రైతు నాగమహేశ్వర రెడ్డి (48) తీవ్రంగా గాయపడ్డారు. పని నిమిత్తం నిమ్మనపల్లికి వచ్చి, తిరిగి వెళ్తుండగా బైకు అదుపుతప్పి కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు వెంటనే అతడిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.0 Comments 0 Shares 45 Views 0 Reviews
-
నిమ్మనపల్లె: రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు.నిమ్మనపల్లె మండలం గౌనిగారిపల్లెకు చెందిన రైతు చెండ్రాయుడు (60) ఆదివారం బోయకొండ వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బోయకొండ టోల్ ప్లాజా వద్ద లారీని తప్పించబోయి అదుపుతప్పి కింద పడిపోవడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.0 Comments 0 Shares 185 Views 0 Reviews
-
పాత పగతో వ్యక్తిపై గ్రామస్తుల దాడి, తీవ్ర గాయాలు.అన్నమయ్య జిల్లా నారిగణిపల్లి పంచాయతీ దిగువ లంబంవారి పల్లి గ్రామంలో పాత పగల కారణంగా ఓ వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెళ్తుండగా దుండగులు మళ్లీ అడ్డగించి దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.0 Comments 0 Shares 136 Views 0 Reviews
-
పాదాచారిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరు మృతిముగ్గురికి తీవ్ర గాయాలుపాదాచారిని ఢీకొన్న ద్విచక్ర వాహనం ఒకరు మృతి ముగ్గురికి తీవ్ర గాయాలు మార్కాపురం జిల్లా.... పెద్ద దోర్నాలలో గ్రామపంచాయతీ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదం అయినముక్కల గ్రామానికి చెందిన భోగ్యం మద్దయ్య నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో మద్దయ్యకు కుడి భుజం విరిగింది. పులిచెర్ల బయన్నకు తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు...0 Comments 0 Shares 261 Views 0 Reviews
-
లారీ ఢీకొని పోస్ట్మాస్టర్కు తీవ్ర గాయాలుసామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో గురువారం మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేట్లపాలెంలోని పెట్రోల్ బంకు సమీపంలో స్కూటీపై ప్రయాణిస్తున్న పోస్ట్మాస్టర్ మలకల సూర్యారావును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం, ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ప్రజలు సూర్యారావును కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోందని...0 Comments 0 Shares 1K Views 0 Reviews
More Results