• మదనపల్లె: బొలెరో ఢీకొని తాతా–మనవరాల కు గాయాలు.
    శుక్రవారం సత్యసాయి జిల్లా కొక్కంటి క్రాస్ బాలసముద్రానికి చెందిన వీరప్ప (60) తన మనవరాలు హిమశ్రీ (7)తో కలిసి బైక్‌పై మదనపల్లెలోని బంధువుల ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో మదనపల్లె రింగ్‌రోడ్ వద్దకు చేరుకోగానే, వేగంగా వచ్చిన బొలెరో వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో తాతా మనవరాలు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు...
    0 Comments 0 Shares 89 Views 0 Reviews
  • రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని జనసేన నాయకుడి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు.
    మదనపల్లెలో శ్రీరామనవమి పండగ సందర్భంగా, ప్రముఖ సినీ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని కోరుతూ జనసేన నాయకుడు రాయల్ గణి ఆధ్వర్యంలో శుక్రవారం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవల సినిమా షూటింగ్‌లో స్వల్ప గాయాలకు గురైన రామ్ చరణ్ తేజ్ త్వరగా కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని మెగా అభిమానులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
    1 Comments 0 Shares 117 Views 0 Reviews
  • మద్యం మత్తులో కత్తెరతో దాడి.. యువకుడికి గాయాలు.
    మదనపల్లె మండలంలోని పోతబోలు పంచాయతీ శానిటోరియంలో శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న వ్యక్తి, వినోద్ కుమార్ అనే యువకుడిపై టైలరింగ్ కత్తెరతో దాడి చేశాడు. ఈ ఘటనలో వినోద్ కుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
    0 Comments 0 Shares 91 Views 0 Reviews
  • జాతీయ రహదారి 30 పై పోలీసుల 'మెరుపు' తనిఖీలు !
    చింతూరు లోని జాతీయ రహదారి 30 పై పోలీసు, అగ్నిమాపక, రవాణా శాఖ వారు ఉమ్మడిగా వాహన తనిఖీలు జరిపారు. ఇటీవల వరుస బస్సు ప్రమాదాలు జరుగుతుండడం ప్రైవేట్ బస్సులు భద్రత ప్రమాణాలు పాటించకపోవడంతో తనిఖీ నిర్వహించారు. ఒరిస్సా నుండి హైదరాబాద్ వెళ్ళే ప్రైవేటు బస్సులు భద్రత ప్రమాణాలు పాటించని కారణంగా 6బస్సుల పై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు సిఐ గోపాలకృష్ణ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్  చెల్లారావు...
    0 Comments 0 Shares 102 Views 0 Reviews
  • Andhra Pradesh Government: ఎన్టీఏ పరీక్షలకు పటిష్ఠ వ్యవస్థ.. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను నియమించిన ఏపీ సర్కార్.
    జాతీయ అర్హత పరీక్ష (నీట్), ఇతర జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతను పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే పరీక్షలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.   ఎన్టీఏ పరీక్షల సంస్కరణలపై కేంద్ర...
    Like
    1
    0 Comments 0 Shares 128 Views 0 Reviews
  • పుంగనూరు: పుంగనూరు పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు జనసేన, టీడీపీ నాయకుల భాగస్వామ్యం
    చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో శ్రీరామనవమి సందర్భంగా రామలయాల్లో విశేష పూజలు జరిగాయి. దోభి కాలనీలో టీం గణేశా ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. యువకులు, పెద్దలు, పిల్లలు అందరూ పాల్గొని పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆలయ పరిసరాలు 'జై శ్రీరామ్' నినాదాలతో హోరెత్తాయి. ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు నరేష్ రాయల్, టీడీపీ నాయకులు రమేష్ బాబు, నాగరాజ, జగన్నాథం, లిఖిత్ మహేష్, రాజేంద్ర,...
    0 Comments 0 Shares 95 Views 0 Reviews
  • పుంగనూరు నియోజకవర్గం:చౌడేపల్లి గంగమ్మ జాతర: భక్తుల రాకకు భారీ ఏర్పాట్లు
    ఏప్రిల్ 7, 8 తేదీల్లో చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని చౌడేపల్లిలో గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ జాతరకు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. జాతర రోజుల్లో గ్రామం జనసందోహంతో కిక్కిరిసిపోతుంది. పల్లకి ఊరేగింపులు, ప్రత్యేక పూజలు జాతరలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. భద్రత, ట్రాఫిక్...
    0 Comments 0 Shares 91 Views 0 Reviews
  • APSP: ఏపీఎస్పీలో 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్‌గ్రేడ్.. ప్రభుత్వ ఉత్తర్వుల జారీ.
    ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ (ఏపీఎస్పీ) విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుళ్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీఎస్పీలోని 300 హెడ్ కానిస్టేబుల్ (హెచ్‌సీ) పోస్టులను అసిస్టెంట్ రిజర్వ్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఏఆర్ఎస్ఐ) పోస్టులుగా అప్‌గ్రేడ్ చేస్తూ హోం శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెం. 62ను విడుదల చేసింది.    ప్రభుత్వ నిర్ణయంతో 8...
    0 Comments 0 Shares 96 Views 0 Reviews
  • పుంగనూరు: నీలగిరి తోటలో అగ్నిప్రమాదం
    పుంగనూరు మండలం, రాగానేపల్లె గ్రామ సమీపంలోని బైపాస్ వద్ద శుక్రవారం రాత్రి నీలిగిరి తోటలో మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో పట్టణానికి చెందిన కుమార్ రాజుకు దాదాపు పదివేల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు తెలిపారు# కొత్తూరు మురళి.
    0 Comments 0 Shares 96 Views 0 Reviews
  • ఇది చూడండి
    16 ఏళ్లలోపు వారిని సోషల్ మీడియా యాప్‌ల నుండి నిషేధించే ఆస్ట్రేలియా చారిత్రాత్మక చట్టాన్ని, తమ సొంత ఆంక్షలను పరిశీలిస్తున్న ఇతర దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ నిషేధం ప్రారంభమై మూడు నెలలు దాటినప్పటికీ, ఇది కొంతమంది తల్లిదండ్రులకు తొలి విజయాలను అందిస్తోంది; కానీ చాలా మంది టీనేజర్లు లొసుగులను కనుగొంటున్నారు. @Reporter SIVAJI 
    0 Comments 0 Shares 259 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com