• బొబ్బిలి మున్సిపల్ ఆర్ ఓగా ఉమామహేశ్వరరావు
    బొబ్బిలి మున్సిపల్ రెవిన్యూ అధికారిగా ఎల్.ఉమామహేశ్వరరావు నియామకమయ్యారు.యలమంచిలి మున్సిపాలిటీలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఉమామహేశ్వరరావుకు ప్రమోషన్ రావడంతో ఆఓగా బాధ్యతలు స్వీకరించారు. పన్నులు వసూలు సకాలంలో వసూలు చేసి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. #RAJESH 
    0 Comments 0 Shares 40 Views 0 Reviews
  • డి.గదబవలస-పణుకువలస రోడ్డు మధ్యన విరిగిపడిన భారీ చెట్టు
    భారీ గాలులకు తెర్లాం మండలంలోని డి. గదబవలస పణుకువలస గ్రామాల మధ్య ఓ చెట్టు రోడ్డుకు అడ్డంగా విరిగిపడిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. తహశీల్దార్ హేమంత్ కుమార్కు సమాచారం అందిన వెంటనే మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, వీఆర్వో తిరుపతిరావులను అక్కడికి పంపించి చెట్టు తొలగించే పనులను చేపట్టారు. చెట్టు పడిపోయిన వెంటనే స్పందించి చెట్టు తొలగించిన తహశీల్దారు కృతజ్ఞతలు తెలిపారు....
    0 Comments 0 Shares 38 Views 0 Reviews
  • గోనెగండ్ల మండలం అగ్రహారం గ్రామంలో మంచినీరు సరఫరా
    శ్రీ శ్రీ శ్రీ ధర్గమ్మ దేవర సందర్భంగా గ్రామంలో తీవ్ర మంచినీటి కొరత నెలకొనడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యను స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ రంగారెడ్డి. మాల ముని , నుకుల వెంకటేష్  తదితరులు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక గారికి తెలియజేశారు.సమస్యపై వెంటనే స్పందించిన శ్రీమతి బుట్టా రేణుక గారు,...
    0 Comments 0 Shares 37 Views 0 Reviews
  • బోయకొండ అటవీ ప్రాంతంలో వ్యక్తి హత్య
    చౌడేపల్లి మండలం బోయకొండ పరిసర అటవీ ప్రాంతంలో వ్యక్తిని హత్య చేసిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు మద్యం మత్తులో కొందరు కలిసి ఓ వ్యక్తిని హత్య చేసినట్లు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే రూరల్ సీఐ సాయి ప్రసాద్, ఎస్ఐ చిన్న రెడ్డప్ప సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. అనుమానితులుగా ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం....
    0 Comments 0 Shares 30 Views 0 Reviews
  • పుంగనూరు: జాతీయ రహదారిపై స్థానికుల నిరసన
    పుంగనూరు బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. పుంగనూరు-ముళ బాగిల్ రోడ్డు అధ్వానంగా ఉందని, కంకర వేసి నెలల తరబడి పనులు ఆపేశారని, దీనితో దుమ్ము, ధూళితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనతో గంటల తరబడి వాహనాల రాకపోకలు స్తంభించాయి# కొత్తూరు మురళి.
    0 Comments 0 Shares 30 Views 0 Reviews
  • పుంగనూరు రోడ్డు పనులు నెలలుగా నిలిచి దుమ్ముతో ప్రజల ఇక్కట్లు
    పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి పనులు నెలలుగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తవ్విన రోడ్డుపై కంకర వేసి వదిలేయడంతో విపరీతమైన దుమ్ము, ధూళి ఇళ్లలోకి చేరుతోంది. దీనివల్ల చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో అనారోగ్యం పాలవుతున్నారని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని, సీఎం చంద్రబాబు నాయుడు, జిల్లా కలెక్టర్...
    0 Comments 0 Shares 30 Views 0 Reviews
  • పుంగునూరు నియోజకవర్గం : బోయకొండలో భర్తను చంపిన భార్య ప్రియుడు
    చౌడేపల్లి మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో గాంధీ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తమిళనాడుకు చెందిన గాంధీ, భార్య రాసతితో కలిసి చౌడేపల్లెలోని కోళ్ల ఫారంలో పనిచేస్తున్నాడు. రాసతికి స్థానికుడు నరసింహులుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. నిన్న రాత్రి గాంధీ, అతని కుమారుడు సందీప్, నరసింహులు మద్యం సేవించడానికి వెళ్లారు. మత్తులో ఉన్న నరసింహులు గాంధీని బండరాళ్లతో కొట్టి చంపాడు. భయపడిన సందీప్ అడవిలోకి వెళ్లిపోయాడు....
    0 Comments 0 Shares 30 Views 0 Reviews
  • పుంగనూరు: రోడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారిపై గుంతలు పడి రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో, రహదారుల భవన శాఖ అధికారికి బిజెపి నాయకులు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఎస్సీ మోర్చా అధ్యక్షులు నరసింహులు మాట్లాడుతూ, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున...
    0 Comments 0 Shares 29 Views 0 Reviews
  • పుంగనూరు నియోజకవర్గ : చౌడేపల్లిగంగ జాతరకు సర్వం సిద్ధం
    పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండల కేంద్రంలో నడివీధి గంగమ్మ జాతర కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిర్వాహకుల వివరాల ప్రకారం, మంగళవారం రాత్రి అమ్మవారి కళ్యాణం, ఊరేగింపు జరిగి, నడివీధిలో భక్తుల దర్శనానికి ఉంచబడుతుంది. బుధవారం సాయంత్రం అమ్మవారి జల్ది కార్యక్రమాలు నిర్వహించబడతాయి. భక్తులకు ఎండ వేడిమి నుండి ఉపశమనం కల్పించడానికి చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి పోలీసుల...
    0 Comments 0 Shares 28 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 22 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com