గోనెగండ్ల మండలం అగ్రహారం గ్రామంలో మంచినీరు సరఫరా

0
207

శ్రీ శ్రీ శ్రీ ధర్గమ్మ దేవర సందర్భంగా గ్రామంలో తీవ్ర మంచినీటి కొరత నెలకొనడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యను స్థానిక నాయకులు మాజీ సర్పంచ్ రంగారెడ్డి. మాల ముని , నుకుల వెంకటేష్  తదితరులు కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బుట్టా రేణుక గారికి తెలియజేశారు.సమస్యపై వెంటనే స్పందించిన శ్రీమతి బుట్టా రేణుక గారు, తమ భర్త మరియు బుట్టా ఫౌండేషన్ అధినేత శ్రీ బుట్టా శివ నీలకంఠ గారికి సమాచారం అందించారు.

దీనిపై స్పందించిన శ్రీ బుట్టా శివ నీలకంఠ గారు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తక్షణమే మంచినీటి ట్యాంకర్లను అగ్రహారం గ్రామానికి పంపించి, గ్రామ ప్రజలకు తాత్కాలికంగా తాగునీటి సౌకర్యం కల్పించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ సమస్యను పరిష్కరించడానికి తక్షణ చర్యలు తీసుకున్నందుకు శ్రీమతి బుట్టా రేణుక గారికి మరియు బుట్టా ఫౌండేషన్‌ అధినేత శ్రీ బుట్టా శివ నీలకంఠ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Prop News
India’s Real Estate Needs a New Standard. Propiinn Delivers It.
The Problem We’re Solving: Why India Needs a Platform Like Propiinn The Indian real estate...
By Bharat Aawaz 2025-06-25 18:59:47 0 2K
Telangana
నిజామాబాద్
BRS పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం BRS పార్టీ సభ్యత్వ నమోదు మరియు SIR పై విస్తృత స్థాయి...
By Sadaq Sadaq 2026-06-09 09:07:03 0 122
Tamilnadu
Tamil Nadu Expands Sports Infrastructure for Youth Growth
Tamil Nadu is strengthening sports infrastructure and youth development through investments in...
By Fathima Safa 2026-06-29 10:47:54 0 68
Telangana
నర్సంపేట పట్టణంలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి...
భారత్ ఆవాజ్ న్యూస్:  నర్సంపేట పట్టణంలోని పలు..కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి....
By Gujile Ramu 2026-04-28 16:01:57 0 287
Telangana
అక్కారం పంప్ హౌజ్ నుంచి నీటి విడుదల
గజ్వేల్: గజ్వేల్ మండలం అక్కారం పంప్ హౌజ్ నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ఇటీవల బీఅర్ఎస్...
By Ponnala Srinivasrao 2026-03-16 10:09:22 0 247
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com