ఇంద్రనగర్ లేబర్ అడ్డా - శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెంకటాపురం డివిజన్ ఇంద్రనగర్ లేబర్ అడ్డా వద్ద శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మహారాజ్ చిత్రపటనికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ధైర్యసాహసాలకు, స్వాభిమానానికి ప్రతీకగా నిలిచిన చత్రపతి శివాజీ మహారాజ్ జీవితం, ఆలోచనలు, పరిపాలనా దూరదృష్టి యువతకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. దేశభక్తి, న్యాయపాలన, ప్రజాహితమే మహారాజ్ లక్ష్యమని, ఆ ఆదర్శాలను నేటి తరాలు ఆచరణలో పెట్టాలని కోరారు.
శివాజీ సేవా సమితి సభ్యులు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తూ సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని ప్రతి ఆదివారం వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, బస్ స్టాప్లు మరియు వివిధ ప్రదేశాలలో స్వయంగా వండి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. వారి సేవాభావాన్ని కొనియాడుతూ సమితి సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో శివాజీ సేవా సమితి సభ్యులు రవి నాయక్, గోపాల్ నాయక్, లక్ష్మణ్ నాయక్, శివారం నాయక్, తిరుపతి నాయక్, తులసి రామ్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు సురేష్, శ్రీనివాస్, లక్ష్మణ్ యాదవ్, పవన్, జమ్మిదార్ ముత్యాలు, రాజు మరియు స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju
Alwal
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz