PMAY-G: ఏపీకి కేంద్రం తీపికబురు.. ఇకపై ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షలు.

0
127

ఏపీలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం కింద నిర్మించే పేదల ఇళ్లకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక్కో ఇంటి నిర్మాణానికి మొత్తం రూ.2.39 లక్షలు అందజేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఈ పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.1.20 లక్షల రాయితీని అందిస్తాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతంగా రూ.72 వేలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతంగా రూ.48 వేలు ఉంటాయి. దీనికి అదనంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.27 వేలు, మరుగుదొడ్డి నిర్మాణం కోసం మరో రూ.12 వేలు కేటాయిస్తారు.

 

పావలా వడ్డీకి రూ.80 వేల డ్వాక్రా రుణం.. వడ్డీ ప్రభుత్వానిదే

వీటితో పాటు డ్వాక్రా సంఘాల ద్వారా పావలా వడ్డీకే రూ.80 వేల బ్యాంకు రుణాన్ని కూడా మంజూరు చేస్తారు. ఈ రుణంపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. దీంతో లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడదు. పెంచిన ధరల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ను గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశించారు. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని అర్హులైన పేద కుటుంబాల పక్కా ఇంటి కల నెరవేరనుంది.

Search
Categories
Read More
Andhra Pradesh
రంజాన్ రోజుల్లో ప్రార్థనల కోసం వెసులుబాటు,ఫిబ్రవరి 18 నుంచి మార్చి 19 వ తేదీ వరకు అనుమతి,సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మైనారిటీ మంత్రి ఫరూక్ .
రంజాన్ పవిత్ర మాసంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు/పాఠశాలలలో పనిచేసే ముస్లిం ఉద్యోగులందరూ సాయంత్రం...
By John Baji 2026-02-11 05:58:30 0 290
Telangana
ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ* 
*ఇకపై ఇంటి వద్ద నుంచే ఫిర్యాదులు: తెలంగాణ పోలీస్ శాఖ*    భారత్ అవాజ్ న్యూస్......
By Vanmoj Suryamohan 2026-01-20 17:15:21 0 364
Andhra Pradesh
పుంగనూరు:బోయకొండ ఆలయానికి హుండీ ద్వారా 35 లక్షల ఆదాయం: ఈవో
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం హుండీ లెక్కింపు...
By Kothuru Murali 2026-03-27 14:26:54 0 123
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com