కార్మికుల హక్కుల కోసం అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం – లేబర్ కోడ్స్ రద్దు చేయాలి: ఆమ్ ఆద్మీ పార్టీ

0
449

కాకినాడ: కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న లేబర్ కోడ్స్ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, వాటిని తక్షణమే రద్దు చేసి కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా చట్టాలను సవరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజ సాంచి డిమాండ్ చేశారు. కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా ఏర్పడిన లేబర్ కౌన్సిల్, ట్రేడ్ యూనియన్ చట్టాల ద్వారా కార్మికులకు లభించిన హక్కులను హరించేలా లేబర్ కోడ్స్ ఉన్నాయని విమర్శించారు. కార్మికుల హక్కుల కోసం అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్ మాట్లాడుతూ, కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకువస్తున్న లేబర్ కోడ్స్ అశాస్త్రీయమైనవని అన్నారు. కార్మిక సమాజానికి నష్టం కలిగించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ పాల్గొన్నారు. కాకినాడ, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ ప్రాంతాల్లో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించబడింది.

Search
Categories
Read More
Andhra Pradesh
Annamayya: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా చిన్నమండెం:   ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా... మంత్రి మండిపల్లి...
By Pagadala Venkateswar 2026-07-21 09:56:50 0 40
Andhra Pradesh
కలెక్టర్ గారిని డిఎస్పి గాని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఎస్పీ మహేందర్ లను శుక్రవారం పుంగనూరు...
By Kothuru Murali 2026-01-02 13:02:45 0 191
Andhra Pradesh
పాలెంపల్లి గ్రామ సమీపంలో మృతదేహం కలకలం
మంగళవారం పుంగనూరు మండలం, పాలెంపల్లి గ్రామ సమీపంలోని ఓ బావిలో వెంకటరమణ (46) అనే యువకుడి మృతదేహం...
By Kothuru Murali 2026-03-04 06:50:20 0 141
SURAKSHA
Radha S. Raturi, IAS: Leading Uttarakhand with Vision
A distinguished 1988-batch IAS officer of the Uttarakhand Cadre, Smt. Radha S. Raturi has earned...
By Lokeshwari Panthadi 2026-07-18 05:06:05 0 40
Telangana
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి లొసుగులను ఆసరాగా చేసుకుని హైదరాబాద్‌లో భారీ రియల్...
By Ponnala Srinivasrao 2026-05-06 03:54:03 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com