మైనంపల్లి కృషితో అభివృద్ధికి మహర్ధశ :₹4.5 కోట్లతో హై టెన్షన్ రోడ్డుపనులకు శ్రీకారం |

0
196

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మచ్చ బొల్లారం డివిజన్ 133 పరిధిలోని హై టెన్షన్ రోడ్డు ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. సుమారు 4.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్డు అభివృద్ధి పనులను నేడు ఘనంగా ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక కృషి, పట్టుదలతో.. జిహెచ్ఎంసి (GHMC) నుండి ఈ నిధులు మంజూరయ్యాయి 

 

విబిఆర్ ఫంక్షన్ హాల్ నుండి, ఎస్. ఎన్. రెడ్డి కాలనీ వరకు అత్యంత దారుణంగా దెబ్బతిన్న ఈ రోడ్డు మార్గం.. అల్వాల్ హిల్స్, సిటిజెన్ కాలనీ, మంజీర కాలనీ, హెచ్ఎంటి కాలనీ, విబిఆర్ కాలనీ, ప్రెసిడెన్సీ కాలనీ, పంచశీల ఎంక్లేవ్, ఇస్.ఎన్ రెడ్డి కాలనీ, మంగాపురం కాలనీ సహా.. పదుల సంఖ్యలో ఉన్న కాలనీలకు ప్రధాన అనుసంధాన రహదారి. నిత్యం వేలాది మంది ప్రయాణికులు, ఈ రోడ్డు ద్వారా జాతీయ రహదారికి చేరుకుంటారు. గత కొంతకాలంగా ఈ రహదారి అధ్వానంగా తయారై ప్రమాదాలకు నిలయంగా మారడంతో, స్థానిక కార్పొరేటర్, కాంగ్రెస్ బృందం ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.  

 

ఈ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్, మరియు ప్రముఖ నేతలు చంద్రశేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, నర్సింగ్ రావు, అలాగే సీనియర్ నాయకులు అశోక్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, లడ్డు రెడ్డి, సహదేవ్, సుభాష్ గౌడ్, విష్ణు, తదితరులు పాల్గొని పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని సూచించారు.

 

ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ కష్టాలు తీరడమే కాకుండా, జాతీయ రహదారికి వెళ్లే ప్రయాణికులకు రక్షణ లభిస్తుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తూ.. నిధుల మంజూరుకు కృషిచేసిన మైనంపల్లి టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్ సి.పి. విసీ సజ్జనర్ - అర్ధరాత్రి స్వయంగస్తి.|
హైదరాబాద్ : హైద‌రాబాద్ సీపీ శ్రీ వీసీ స‌జ్జ‌న‌ర్, ఐపీఎస్ అర్థ‌రాత్రి...
By Sidhu Maroju 2025-11-24 10:04:16 0 183
Andhra Pradesh
రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకం రైతన్నలకు భరోసా
రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలతో రైతన్నలకు భరోసా   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు...
By Rajini Kumari 2026-04-04 14:43:21 0 226
Andhra Pradesh
రోజల శిక్షణకు హాజరుకావాలి:బొబ్బిలి ఎంపీడీవో
బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం, గురువారం ఎస్.బి.ఎం(జి) ఆక్టివిస్ట్ప జరగనున్న శిక్షణను...
By Boiena Rajesh 2026-06-03 02:05:32 0 187
SURAKSHA
​Rema Rajeshwari: A Trailblazer in Modern Indian Policing
Rema Rajeshwari ::A Trailblazer of Modern PolicingTransforming Communities Through Courage and...
By Kalaga Sailaja 2026-07-11 10:26:04 0 57
Andhra Pradesh
పారిశ్రామికవేత్తలకు ప్రముఖులకు ఎంపీ కేసినేని శివనాద్ పిలుపు
*ప్ర‌చుర‌ణార్థం* *21-12-2025*   ఎన్టీఆర్ జిల్లాను పేద‌రికం లేని జిల్లాగా...
By Rajini Kumari 2025-12-22 07:34:38 0 193
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com