జగ్గయ్యపేట పట్టణంలోని పదవ వార్డ్ చిరు నగర్ లో పెన్షన్ల పంపిణీ

0
169

ప్రెస్ నోట్

తేదీ: 31.12.2026

 

జగ్గయ్యపేట పట్టణంలోని 10వ వార్డు, చిరునగర్‌లో అర్హులైన లబ్ధిదారుల కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి, KDCC బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్ గారు మరియు కౌన్సిలర్ కన్నెబోయిన రామలక్ష్మి గారు ప్రారంభించారు.

 

ఈ కార్యక్రమంలో నెట్టెం రఘురామ్ గారు లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారిని వ్యక్తిగతంగా కలిశారు. వారి సమస్యలు, అవసరాలు మరియు అభ్యర్థనలను గమనించి, వ్యక్తిగతంగా పెన్షన్ నగదు అందజేశారు. లబ్ధిదారుల సమస్యలపై చూపిన ప్రత్యేక శ్రద్ధ, వారిలో నమ్మకం మరియు సంతృప్తిని పెంపొందించింది.

 

ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావటంతో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులకు పెన్షన్లను ఒక రోజు ముందుగా పంపిణీ చేయడం జరిగింది.

 

నెట్టెం రఘురామ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిరునగర్‌లో ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని ఈ సందర్భంగా ప్రజలు గుర్తు చేసుకున్నారు

 

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు నెట్టెం శివరాం గారు మాజీ కౌన్సిల్ కోరుకూటి సైదులు గారు కోరుకూటి బొబ్బిలి గారు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
హకీమ్ మహమ్మద్ తాహిర్ అన్వర్) గుర్తు తెలియని పరిస్థితుల్లో మరణించాడు
పాకిస్తాన్‌ కు ఒక్కసారిగా షాక్...... భారత్ లో పాక్ ప్రేమికులకు నిద్రపట్టని సమయం... మసూద్...
By Thalakayala Nagashiva 2026-04-03 10:24:28 0 265
Andhra Pradesh
Vidyasagar: ఏపీ జేఏసీ చైర్మన్‌గా విద్యాసాగర్ ఏకగ్రీవంగా ఎన్నిక.
అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా ప్రభుత్వం పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలన్న విద్యాసాగర్ 33 ఏళ్ల...
By Pagadala Venkateswar 2026-02-11 11:49:26 0 111
Andhra Pradesh
ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం
*ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం*   *-నియోజకవర్గ యువనాయకులు మండలి...
By Rajini Kumari 2026-03-27 13:12:42 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com