TTD: టీటీడీ కీలక నిర్ణయం.. తిరుమలలో శ్రీవారి డాలర్ల అమ్మకాలు బంద్.

0
150

నష్టాలు నివారించేందుకు అమ్మకాల్లో మార్పులకు శ్రీకారం

రోజువారీ ధరలు, దర్శన టికెట్ ఉన్నవారికే డాలర్లు అమ్మేలా కొత్త విధానం

ఒకరికొకటి మాత్రమే, పాన్ కార్డు నిబంధన అమలుకు ప్రణాళిక

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో విక్రయించే శ్రీవారి బంగారం, వెండి డాలర్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. బయట మార్కెట్ ధరలతో పోలిస్తే టీటీడీ డాలర్ల ధరలు తక్కువగా ఉండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు భక్తులు ఎగబడటంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి విక్రయ కౌంటర్‌ను మూసివేశారు.

 

గత కొంతకాలంగా బంగారం ధరలు ఆకాశాన్నంటున్నాయి. అయితే, టీటీడీ నిబంధనల ప్రకారం డాలర్ల ధరలను వారానికి ఒకసారి (ప్రతి మంగళవారం) మాత్రమే సవరిస్తారు. కానీ, బులియన్ మార్కెట్‌లో ధరలు రోజూ మారుతుండటంతో టీటీడీకి ఆర్థికంగా నష్టం వాటిల్లుతోంది. ఈ వ్యత్యాసాన్ని గమనించిన భక్తులు 5 గ్రాములు, 10 గ్రాముల డాలర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. దీంతో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

 

ఈ నష్టాలను నివారించి, విక్రయాల్లో పారదర్శకత పెంచేందుకు టీటీడీ కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇకపై తిరుపతి బులియన్ మార్కెట్‌కు అనుగుణంగా రోజువారీ ధరలను ప్రకటించి డాలర్లను విక్రయించాలని భావిస్తోంది. అంతేకాకుండా శ్రీవారి దర్శనం టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే ఒక డాలర్ చొప్పున అమ్మాలని యోచిస్తోంది. రూ.50 వేలు దాటిన కొనుగోళ్లకు పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చి, డాలర్ల విక్రయాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
హెచ్ పీవీ వాక్సినేషన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో శనివారం పర్యటించారు....
By Boiena Rajesh 2026-02-28 13:59:30 0 188
Andhra Pradesh
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు 
జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ...
By Chennaiah Kati 2026-07-10 07:31:57 0 59
Andhra Pradesh
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి నేటి షెడ్యూల్
*ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్(16.12.2025)* • ఉదయం 10.15 గంటలకు...
By Rajini Kumari 2025-12-16 08:38:10 0 182
Andhra Pradesh
పుంగనూరు: పనుల వసూళ్లను పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో జరుగుతున్న పంచాయతీ పనుల వసూళ్లను డిప్యూటీ ఎంపీడీవో గఫూర్...
By Kothuru Murali 2026-03-24 08:12:09 0 143
Maharashtra
Massive Digital Shift: Over 11 Lakh Families Complete Census Self-Enumeration
Maharashtra is embracing a major digital transition. Official data released today confirms that...
By Dunna Jessicaruth 2026-05-18 09:48:25 0 62
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com