TTD: టీటీడీ కీలక నిర్ణయం.. తిరుమలలో శ్రీవారి డాలర్ల అమ్మకాలు బంద్.

0
32

నష్టాలు నివారించేందుకు అమ్మకాల్లో మార్పులకు శ్రీకారం

రోజువారీ ధరలు, దర్శన టికెట్ ఉన్నవారికే డాలర్లు అమ్మేలా కొత్త విధానం

ఒకరికొకటి మాత్రమే, పాన్ కార్డు నిబంధన అమలుకు ప్రణాళిక

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో విక్రయించే శ్రీవారి బంగారం, వెండి డాలర్ల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసింది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. బయట మార్కెట్ ధరలతో పోలిస్తే టీటీడీ డాలర్ల ధరలు తక్కువగా ఉండటంతో వాటిని కొనుగోలు చేసేందుకు భక్తులు ఎగబడటంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి విక్రయ కౌంటర్‌ను మూసివేశారు.

 

గత కొంతకాలంగా బంగారం ధరలు ఆకాశాన్నంటున్నాయి. అయితే, టీటీడీ నిబంధనల ప్రకారం డాలర్ల ధరలను వారానికి ఒకసారి (ప్రతి మంగళవారం) మాత్రమే సవరిస్తారు. కానీ, బులియన్ మార్కెట్‌లో ధరలు రోజూ మారుతుండటంతో టీటీడీకి ఆర్థికంగా నష్టం వాటిల్లుతోంది. ఈ వ్యత్యాసాన్ని గమనించిన భక్తులు 5 గ్రాములు, 10 గ్రాముల డాలర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. దీంతో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

 

ఈ నష్టాలను నివారించి, విక్రయాల్లో పారదర్శకత పెంచేందుకు టీటీడీ కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఇకపై తిరుపతి బులియన్ మార్కెట్‌కు అనుగుణంగా రోజువారీ ధరలను ప్రకటించి డాలర్లను విక్రయించాలని భావిస్తోంది. అంతేకాకుండా శ్రీవారి దర్శనం టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే ఒక డాలర్ చొప్పున అమ్మాలని యోచిస్తోంది. రూ.50 వేలు దాటిన కొనుగోళ్లకు పాన్ కార్డు వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చి, డాలర్ల విక్రయాలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Search
Categories
Read More
Andhra Pradesh
రాజ్య అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా అనుములు విజయ్ కుమార్ గౌడ్ ఎన్నిక.
*రాజ్యాధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా అనుమోలు విజయకుమార్ గౌడ్* రాజ్యాధికార పార్టీ...
By KOTESWARARAO KVSR 2025-12-22 09:41:54 0 200
Andhra Pradesh
మదనపల్లి ఘటన చిన్నారి రిషిక అంత్యక్రియలకు హాజరైన రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
ఈరోజు మదనపల్లి బాధితురాలు చిన్నారి రిషిక అంత్యక్రియలకు హాజరైన రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-02-18 10:22:18 0 39
Andhra Pradesh
అయ్యప్ప స్వామి టెంపుల్ లో మెట్లపడిపూజ
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం ఎర్రాతివారిపల్లిలోని అయ్యప్పస్వామి ఆలయంలో శనివారం రాత్రి...
By Kothuru Murali 2025-12-28 09:39:47 0 92
Andhra Pradesh
Tirumala Festival: తిరుమలలో వేటగాడిగా మారిన శ్రీనివాసుడు! పార్వేట మండపంలో అట్టహాసంగా పార్వేటి ఉత్సవం..
తిరుమల గిరిపై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి చెంత సంక్రాంతి సంబరాలు...
By Pagadala Venkateswar 2026-01-17 06:18:11 0 67
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా డీపీఎంఓగా బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబు.
అన్నమయ్య జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్ (డీపీఎంఓ)గా డాక్టర్ రమేష్ బాబు బుధవారం...
By Pagadala Venkateswar 2026-02-12 04:46:18 0 20
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com