తండ్రి వియోగం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య.|

0
196

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: (భారత్ అవాజ్ ప్రతినిధి)

తండ్రి మరణం కలిగించిన తీరని లోటు, మానసికవేదన ఒక యువకుని ప్రాణాలను బలితీసుకుంది.

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ క్వార్టర్స్ లో గురువారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 

 

బీహెచ్ఈఎల్ క్వార్టర్స్ లో నివాసముండే ఎస్. బాబుఅచ్చన్న (33) గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తడితో బాధపడుతున్నాడు. 2021 అక్టోబర్ లో తన తండ్రి మరణించినప్పటి నుండి అచ్చన్న తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు. 

 

తండ్రి జ్ఞాపకాలనుండి బయటపడలేక, మానసిక అనారోగ్యం తోడవడంతో తీవ్ర మనోవేదనకు లోనైనా అచ్చన్న తన నివాసంలో గురువారం తెల్లవారుజామున సుమారు 3:45 గంటల సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

 

ఉదయం నిద్ర లేచిన తల్లి సోడదాసి విమలమ్మ, తన కుమారుడు విగత జీవిగా వేలాడుతుండడం చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

 

సమాచారం అందుకున్న ఆల్వాల్ పోలీసులు ఉదయం 6:10 గంటలకు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తన కుమారుడి మరణం పై ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవని, మానసిక బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
సోమల: ద్విచక్ర వాహనంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, ఎస్ నడింపల్లి వద్ద గత నెల 27న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో...
By Kothuru Murali 2026-05-03 16:37:11 0 97
Telangana
శ్రీ మహంకాళి ఆషాడ బోనాల సందర్భంగా పలు శాఖలతో ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం
సికింద్రాబాద్. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలను...
By Sidhu Maroju 2025-06-24 08:10:53 0 1K
Telangana
"దేశ సేవ నుంచి దోపిడీ దారి: రిటైర్డ్ ఆర్మీ అధికారి అరెస్ట్.|
సికింద్రాబాద్: నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారిని రైల్వే...
By Sidhu Maroju 2026-04-10 06:24:45 0 282
Andhra Pradesh
ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రత ప్రణాళిక పటిష్ట బందోబస్తు
ముఖ్యమంత్రి పర్యటనకు ముందస్తు భద్రతా ప్రణాళిక – పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు ఈ నెల 27వ తేదీ...
By Chennaiah Kati 2026-06-25 13:10:54 0 58
Andhra Pradesh
రాజధాని కార్మిక వాడల్లో డిసెంబర్ 15న ఎర్రజెండాల ఆవిష్కరణ
*ఉండవల్లిలో మున్సిపల్ కార్మికులను ఉద్దేశించి శనివారం నాడు మాట్లాడుతున్న సిఐటియు గుంటూరు జిల్లా...
By Rajini Kumari 2025-12-13 09:59:44 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com