మదనపల్లి: బాలికల కళాశాల ప్రిన్సిపల్‌గా శివపార్వతి దేవి.

0
83

మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా సీనియర్ అధ్యాపకురాలు శివపార్వతి దేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి పదవీ విరమణ చేయడంతో, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఆమెకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. అన్నమయ్య జిల్లాలోనే పేరున్న ఈ కళాశాలలో బాధ్యతలు నిర్వహించడం 'కత్తిమీద సాము' వంటిదని ఆమె వ్యాఖ్యానించారు. విద్యార్థినుల క్రమశిక్షణ, విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com