తండ్రి వియోగం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: (భారత్ అవాజ్ ప్రతినిధి)
తండ్రి మరణం కలిగించిన తీరని లోటు, మానసికవేదన ఒక యువకుని ప్రాణాలను బలితీసుకుంది.
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ క్వార్టర్స్ లో గురువారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
బీహెచ్ఈఎల్ క్వార్టర్స్ లో నివాసముండే ఎస్. బాబుఅచ్చన్న (33) గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తడితో బాధపడుతున్నాడు. 2021 అక్టోబర్ లో తన తండ్రి మరణించినప్పటి నుండి అచ్చన్న తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు.
తండ్రి జ్ఞాపకాలనుండి బయటపడలేక, మానసిక అనారోగ్యం తోడవడంతో తీవ్ర మనోవేదనకు లోనైనా అచ్చన్న తన నివాసంలో గురువారం తెల్లవారుజామున సుమారు 3:45 గంటల సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఉదయం నిద్ర లేచిన తల్లి సోడదాసి విమలమ్మ, తన కుమారుడు విగత జీవిగా వేలాడుతుండడం చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
సమాచారం అందుకున్న ఆల్వాల్ పోలీసులు ఉదయం 6:10 గంటలకు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తన కుమారుడి మరణం పై ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవని, మానసిక బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#sidhumaroju
Alwal
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz