తండ్రి వియోగం తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య.|

0
163

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: (భారత్ అవాజ్ ప్రతినిధి)

తండ్రి మరణం కలిగించిన తీరని లోటు, మానసికవేదన ఒక యువకుని ప్రాణాలను బలితీసుకుంది.

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ క్వార్టర్స్ లో గురువారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 

 

బీహెచ్ఈఎల్ క్వార్టర్స్ లో నివాసముండే ఎస్. బాబుఅచ్చన్న (33) గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తడితో బాధపడుతున్నాడు. 2021 అక్టోబర్ లో తన తండ్రి మరణించినప్పటి నుండి అచ్చన్న తీవ్రమైన మనస్తాపానికి గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు. 

 

తండ్రి జ్ఞాపకాలనుండి బయటపడలేక, మానసిక అనారోగ్యం తోడవడంతో తీవ్ర మనోవేదనకు లోనైనా అచ్చన్న తన నివాసంలో గురువారం తెల్లవారుజామున సుమారు 3:45 గంటల సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

 

ఉదయం నిద్ర లేచిన తల్లి సోడదాసి విమలమ్మ, తన కుమారుడు విగత జీవిగా వేలాడుతుండడం చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

 

సమాచారం అందుకున్న ఆల్వాల్ పోలీసులు ఉదయం 6:10 గంటలకు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. తన కుమారుడి మరణం పై ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవని, మానసిక బాధతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

 

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు ఎమ్మార్వో కార్యాలయాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్
అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి...
By Kothuru Murali 2026-01-07 12:48:45 0 137
Andhra Pradesh
అలివేలమ్మ తల్లి తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సౌమ్య
ఘనంగా చందర్లపాడులో అలివేలమ్మ తల్లి తిరునాళ్లు  అమ్మవారి ఆశీస్సులతో ప్రజల సంక్షేమం,...
By Patan Khuddus 2026-05-01 17:23:51 0 210
Telangana
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
By Krishna Balina 2026-02-09 06:07:47 0 241
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com