జనసేన నాయకుల మనవతా జనసేన నాయకుల మానవతా దృక్పథం

0
158

జనసేన నాయకుల మానవతా 

 

ఎచ్చెర్లలో హత్యకు గురైన జన సైనికుడు కుటుంబానికి శ్రీ పంచకర్ల సందీప్ రూ. 50 వేలు, శ్రీ విశ్వక్ సేన్ రూ. 50 వేలు ఆర్థిక సహాయం 

 ఉపాధి కల్పించిన శాసనమండలి సభ్యులు, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ Naga Babu గారు 

ఎచ్చెర్లలో హత్యకు గురైన జన సైనికుడు శ్రీ పుక్కాల రాజశేఖర్ కుటుంబానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు, జనసేన భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి డా.పంచకర్ల సందీప్ రూ.50 వేలు, ఎచ్చెర్ల నియోజకవర్గం పీఓసీ శ్రీ విశ్వక్ సేన్ రూ.50 వేలు మొత్తం రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేయడం ద్వారా జనసేన నాయకుల మానవతా దృక్పథం మరోసారి నిరూపితమైంది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం ఎచ్చెర్ల ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంకు విచ్చేసిన శాసనమండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు గారు సమక్షంలో చెక్కులను అందజేశారు. శ్రీ పుక్కాల రాజశేఖర్ సతీమణి శ్రీమతి హరిప్రియ ఇటీవల ఎచ్చెర్ల పర్యటనలో శ్రీ నాగబాబు గారిని కలిసి.. సంబంధం లేని ఘర్షణలో తన భర్తను హత్యచేశారని, కుటుంబ పోషణ భారంగా ఉన్నదని మొరపెట్టుకున్నారు. అప్పటికప్పుడు కొంత ఆర్థికసహాయం అందజేసిన శ్రీ నాగబాబు గారు ఉపాధి అవకాశం కల్పించారు. శ్రీమతి హరిప్రియ ఫిబ్రవరి నుంచి ఉద్యోగంలో చేరనున్నారు. మానవతా దృక్పథంతో జనసైనికుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ పంచకర్ల సందీప్, శ్రీ విశ్వక్ సేన్ లను శ్రీ కె. నాగబాబు గారు ప్రత్యేకంగా అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
జాతీయస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులను సన్మానించిన కర్నూల్ ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా...జాతీయస్థాయి ట్రెడిషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో గెలుపు పొందిన కర్నూలు...
By Hari Krishna 2026-01-02 15:29:55 0 188
Telangana
నాన్నగారు దేశం కోసం ధర్మంకోసం ఇంతలా పాకులాడుతుంటే నువ్వెందుకు కనపడకుండా పోయావ్? బగీరత్ బాబు..సురేష్ సందరికారి
‎మా భగి బాబు ఒక్కరోజు కనపడకపోతేనే విలవిల్లాడిపోతాం అలాంటిది మన కరీంనగర్ ఆణిముత్యం సాక్చాత్తూ...
By Ponnala Srinivasrao 2026-05-13 00:38:38 0 71
Andhra Pradesh
అధ్వానంగా మారిన వేలంక రోడ్డు
కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంతో అధ్వానంగా తయారయిందని...
By Nandika Jayababu 2026-03-18 07:54:51 0 285
Andhra Pradesh
పుంగనూరులో సిపిఐ నాయకుల నిరసన
పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద సీపీఐ నాయకులు ఆదివారం ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన...
By Kothuru Murali 2026-05-24 17:30:51 0 14
Andhra Pradesh
పార్వతీపురం జిల్లాలో గజరాజుల సంచారం
పార్వతీపురం జిల్లా జియ్యమ్మవలస పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా గజరాజులు...
By Boiena Rajesh 2026-03-23 05:03:05 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com