విద్యార్థులకు ఉచిత నోట్ బుక్స్ పంపిణీ
పాఠశాల చిన్నారులకు విద్యా ప్రోత్సాహం.
దాతల సేవాభావానికి ప్రశంసలు
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం :
నందిగామ శివారు డీవీఆర్ కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు సోమవారం 455 ఉచిత నోట్బుక్స్ పంపిణీ చేశారు. విద్యా సామగ్రి అందించడం అభినందనీయమని అన్నారు. దాతల సేవాభావాన్ని కొనియాడుతూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని ఆకాంక్షించారు.
డీవైఈవో గురునాథం చేతుల మీదుగా నోట్బుక్స్ పంపిణీ
ఈ ప్రముఖ అతిథిగా హాజరైన డీవైఈవో గురునాథం విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం గొప్ప సామాజిక సేవ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంఈవో పద్మ, నాగలక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, కాంప్లెక్స్ చైర్మన్, పాఠశాల ఉపాధ్యాయులు, నకరికంటి నరేష్ కుమార్, పులిపాటి వెంకటేశ్వరరావు, మహంకాళి భాస్కరరావు, సముద్రాల ఈశ్వరయ్య, జూలూరు నాగేశ్వరరావు, జెమిలి మల్లేష్, ఉడత శ్రీనివాసరావు, దేవత పద్మజ ఉన్నారు.
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz