అనంతపురం: ఘనంగా పోలీసు కవాతు గ్రౌండ్‌లో గణతంత్రం దినోత్సవ వేడుకలు

0
499

గణతంత్ర దినోత్సవ పరేడ్, బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు

ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రమశిక్షణతో పరేడ్ నిర్వహించాలని... ప్రముఖుల నుండీ ప్రజలు, విద్యార్థులు పాల్గొనే వేడుకలలో పటిష్ట భద్రత చేపట్టాలని ఆదేశాలు జారీ

అనంతపురం పోలీస్ పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకల పురస్కరించుకుని సోమవారం నిర్వహించే సాయుధ బలగాల పరేడ్ ను మరియు బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు సాయుధ దళాల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం పరిశీలన వాహనంపై వెళ్లి ప్లటూన్ల వారీగా పరేడ్‌ను సమగ్రంగా పరిశీలించారు. వి.వి.ఐ.పి తరహాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పరేడ్‌లో పాల్గొన్న పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డ్స్, ఎన్.సి.సి క్యాడెట్లు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాల కవాతును పరిశీలించి, క్రమశిక్షణతో సమన్వయంగా నిర్వహించాల్సిన విధానాలపై అధికారులకు తగిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. రిపబ్లిక్ డే ఉత్సవాలకు విచ్చేసే వివిఐపీ, వీఐపీ అతిథులకు కూర్చునే సిట్టింగ్ ఏర్పాట్లు, భద్రత, సౌకర్యాలపై ఆరా తీసి లోటుపాట్లు లేకుండా పక్కాగా చేపట్టాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రిపబ్లిక్ డే ఉత్సవాన్ని రాష్ట్రంలోనే గుర్తుండిపోయే విధంగా నిర్వహించాలని అధికారులకు తగిన సూచనలు, సలహాలు మరియు ఆదేశాలు ఇచ్చారు.సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం విద్యార్థినీ విద్యార్థులకు తగిన ఏర్పాట్లు ముందుగానే ఇతర అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.

ఈ ఫుల్ డ్రస్ రిహార్సల్స్‌లో పోలీస్ సిబ్బంది, హోమ్ గార్డ్స్, ఎన్.సి.సి క్యాడెట్లు, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బాలబాలికలు తదితర బృందాలు కవాతులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోలీసు జాగిలాల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లా ఎస్పీ గారితో పాటు ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా మరియు పలువురు ఆర్ ఐ లు, ఆర్ ఎస్ ఐ లు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయవాడ కుమ్మరిపాలెం ఈద్గా షాది ఖానా బరియల్ గ్రౌండ్ సందర్శన
*ప్ర‌చుర‌ణార్థం* *16-01-2026*     రాజకీయాలకు అతీతంగా ఈద్గా, షాదీ ఖానా,...
By Rajini Kumari 2026-01-16 12:47:00 0 191
Andhra Pradesh
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్ న్యూస్.
14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు  ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్ల...
By Pagadala Venkateswar 2026-01-23 05:45:48 0 351
Telangana
నిజామాబాద్
నిజామాబాద్ నగరంలో BRS పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు డివిజన్...
By Sadaq Sadaq 2026-05-14 16:32:17 0 95
Andhra Pradesh
ఎంపీ శివనాద్ కార్యాలయంలో రెటంపల్లి శ్యామ్ కి సన్మానం
*ప్ర‌చుర‌ణార్థం* *05-03-2026*   *కష్టపడి పనిచేసే వారికి టిడిపిలో గుర్తింపు...
By Rajini Kumari 2026-03-06 01:50:15 0 177
Telangana
కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క..బల్మురి వెంకట్
కేసీఆర్ తెలంగాణకు తురుపు ముక్క కాదు...కలుపు మొక్క. ‎కేసీఆర్ తెలంగాణకు ఓజీ కాదు.... నాజీ గా...
By Ponnala Srinivasrao 2026-06-04 04:59:17 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com